సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి
ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కొత్తకోట, ఏప్రిల్ 22 : రైతు సంక్షేమం కోసం ప్ర భుత్వం పాటుపడుతుందని సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని విలియంకొండ, నాటవెల్లి, పామాపురం, రామకిష్టాపురం, అప్పరాల, చర్లపల్లి గ్రామాల్లో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని సీడీసీ చైర్మన్తోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ సాకబాలనారాయణ, సింగిల్విండో చైర్మన్ వాసుదేవరెడ్డి ప్రారంభించా రు. ఈ సందర్భంగా సీడీసీ చైర్మన్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొం టామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అ ధికారి ప్రశాంత్, సర్పంచులు లావణ్య, శారద మ్మ, హిమబిందు, నారమ్మ, నగేశ్, లక్ష్మీకాంత్రెడ్డి, గోపాల్నాయక్, పాండునాయక్, గోవిందునాయుడు, లక్ష్మి, వెంకటేశ్, శంకర్ పాల్గొన్నారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
మండల కేం ద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో సింగిల్విండో, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశార ని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని డీసీవో కోదండరాములు కోరారు. గురువారం మండల కేంద్రంతోపాటు మండలంలోని సోలీపూర్, కమాలొద్దీన్పూర్, అల్లమాయిపల్లి, మల్కినియాన్పల్లి, సల్కలాపూర్ గ్రామాల్లో సింగిల్విం డో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ కృష్ణనాయక్, జెడ్పీటీ సీ సామ్యనాయక్, విండో అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్ద తు ధర కల్పిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, పీఏసీసీఎస్ ఉపాధ్యక్షుడు రాజు, డైరెక్టర్లు కృష్ణయ్యగౌడ్, గోవింద్, సాయిచరణ్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఖరీంపాషా, సర్పంచులు పద్మశ్రీ, ఉమా, కృష్ణవేణి, శాంతసాయులు, పిన్యానాయక్, శేషయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు.
పెబ్బేరులో..
పెబ్బేరు/రూరల్, ఏప్రిల్ 22 : ప్రభుత్వం ఏర్పా టు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మంగరాయి శ్యామ ల అన్నారు. గురువారం పట్టణంలోని వ్యవసా య మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళారులతో సంబం ధం లేకుండా నేరుగా పంట పండించిన రైతుకు లాభం చేకూర్చాలని ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. కరోనా నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పెబ్బేరు మండలం ఏటిగడ్డశాఖాపురం, రామమ్మపేట గ్రామాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం శాఖాపురంలో వైస్ఎంపీపీ బాలచంద్రారెడ్డి ప్రారంభించారు. సింగిల్విండో ఆధ్వర్యంలో ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర కు కొంటుందని ఆయన చెప్పారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, ఎంపీపీ శైల జ, జెడ్పీటీసీ పద్మ, విండో చైర్మన్ కోదండరాంరె డ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ కర్రెస్వామి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ నవీన్కుమార్రెడ్డి, మార్కెట్ డై రెక్టర్లు భారతిగౌడ్, బలరాంనాయుడు, శ్రీను, నాయకులు సాయినాథ్, మన్యం, వెంకటేశ్, కు రుమూర్తి, మల్లేశ్యాదవ్, సర్పంచ్ రవికుమార్, సింగిల్ విండో వైస్చైర్మన్ ఆంజనేయులు, ఉపసర్పంచ్ ఎల్లయ్య, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
వనపర్తి రూరల్, ఏప్రిల్ 22 : ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ప్రతి గింజ నూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎంపీపీ కిచ్చారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వెంకటాపురం, అంకూర్, చిమనగుంటపల్లి, చిట్యాల, కాశీంనగర్, పెద్దగూడెం, కడుకుంట్ల గ్రా మాల్లో సహకార సంఘాల, మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ కిచ్చారెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు, సహకార సంఘాల చైర్మన్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని వరి కేంద్రాలను ప్రారంభించామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో వనపర్తి, నాగవరం సహకార సంఘం చైర్మన్లు వెంకట్రావు, మధుసూదన్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు రామేశ్వరి, విష్ణువర్ధన్రెడ్డి, భానుప్రకాశ్రావు, కొండన్న, హరిత, ఎంపీటీసీ రాజేశ్వరి, నాగరాజు, ధర్మనాయక్, ధర్మశాస్త్రి, జిల్లా సహకార అధికారి కొదండరాములు, ఏపీడీవో రేణుక, కోఆప్షన్ మెంబర్ శంషోద్దీన్, రాజు, సుదర్శన్రెడ్డి, నరేశ్, రాజేశ్వర్రెడ్డి, బాలకృష్ణ, మండల వ్యవసాయశాఖ అధికారి కురుమయ్య పాల్గొన్నారు.
రైతును రాజు చేయడమే లక్ష్యం
పెద్దమందడి, ఏప్రిల్ 22 : రాష్ట్రంలో రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని సింగిల్విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంతోపాటు మండలంలోని మనిగిల్ల, మద్దిగట్ల, గట్లఖానాపూర్ గ్రామాల్లో సింగిల్విండో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమం లో సింగిల్విండో మాజీ అధ్యక్షుడు సత్యారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు సునీత, వెంకటేశ్, రమేశ్, మాజీ సర్పంచ్ నారాయణ, సింగిల్విం డో డైరెక్టర్లు నరేశ్, వెంకటేశ్వర్రెడ్డి, శ్యాంసుందర్రావు, సేనాపతి, రామన్గౌడ్, బాలు, రైతులు ప్రవీణ్రెడ్డి, సీఈవోలు జగదీశ్వర్రెడ్డి, సుధాకర్, ఎంపీటీసీ చిన్నమ్మ, పుల్లయ్యయాదవ్, రాంచంద్రయ్య పాల్గొన్నారు.
శ్రీరంగాపూర్లో..
శ్రీరంగాపూర్, ఏప్రిల్ 22 : మండలంలోని శ్రీరంగాపూర్, జానంపేట గ్రామాల్లో గురువారం సింగిల్విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో అధ్యక్షుడు జగన్నాథంనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్విండో అధ్యక్షుడు జగన్నాథం నాయుడు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గౌడ్నాయక్, సర్పంచ్ వినీలరాణి, ఎంపీటీసీ ఎల్లస్వామి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
‘మేజర్’ కోసం తాజ్ప్యాలెస్ హోటల్ సెట్