కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలి
సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ
చిన్నకోడూరు, ఏప్రిల్ 22 : రైతాంగానికి ప్రభు త్వం అన్ని విధాలా సహకారం అందిస్తున్నది, రైతుల చెంతనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నదని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. గురువారం మండలంలోని చంద్లాపూర్, పెద్దకోడూరు, రామునిపట్ల, రామంచ, మాచాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ కూర మాణిక్యరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగనాయకసాగర్ రిజర్వాయర్ కాల్వల ద్వారా ఈ ఏడాది వరి పంటలు బాగా పండాయన్నారు. వరికోతలు షురువయ్యాయని.. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతు లు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటించాలన్నారు. మాస్క్లు లేకుండా కేంద్రాలకు రావొద్దన్నారు. కేంద్రాల వద్ద తాగునీటి వసతితో పాటు రైతులకు ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఆర్ఐ శివప్రసాద్, సర్పంచులు చంద్రకళ రవిగౌడ్, లింగం, శ్రీనివా స్, సంతోషి విక్రమ్, బాబు, ఎంపీటీసీలు దుర్గారెడ్డి, సాయన్న, వెంకటలక్ష్మి, జమున ఎల్లయ్య, అల్లీపూర్ సొసైటీ చైర్మన్ సదానందంగౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ చంద్రమౌళిగౌడ్, రైతుబంధు సమితి మండల కమిటీ సభ్యుడు రమేశ్, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు భిక్షపతి, రైతులు పాల్గొన్నారు. కస్తూరిపల్లిలో గంగాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పద్మ గోవిందగిరిస్వామి ప్రారంభించారు.