మహబూబ్నగర్ మెడికల్ కళాశాలలో కిట్ ఏర్పాటు
కరోనాపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష
హౌస్ సర్జన్లు కొవిడ్ సేవకు ముందుకు రావాలి
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్షలను వేగవంతంగా చేసే అవకాశం ఏర్పడిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆర్టీపీసీఆర్ నిర్ధారణ పరీక్షలను వెంటనే తెలిపేందుకు ప్రభుత్వ వైద్య కళాశాల లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ న్యూక్లియర్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆర్టీపీసీఆర్ ఫలితాలు వచ్చేందుకు సుమారు ఆరు గంట ల సమయం పట్టేదని, ఈ నూతన పరికరం ద్వారా కేవ లం రెండున్నర గంటల్లోపే ఫలితాలు వస్తాయని వెల్లడించారు. దీంతో తక్షణమే కరోనా చికిత్స ప్రారంభించొచ్చన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం ల్యా బ్ మంజూరు చేయగా, ఇప్పుడు ఆటోమెటిక్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ జనరల్ దవాఖానలో త్వరలోనే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. ఇంటింటి సర్వేపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని తెలిపా రు. అందరికీ వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీ సుకుంటున్నదన్నారు. హౌస్ సర్జన్లు కరోనా బాధితులకు సేవలందించేందుకు ముందుకు రావాలని కోరారు. అం తకు ముందు మూడో ఏడాది చదువుతున్న వైద్య విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. కళాశాలలో వసతులు, విద్యా విధానం, అకాడమిక్ క్యాలెండర్, భోజనం ఇతర సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునందిని, డాక్టర్లు నవ కల్యాణి, రమాదేవి, కిరణ్ తదితరులు ఉన్నారు.
రిటైర్డ్ జవాన్ మృతదేహానికి నివాళి..
హన్వాడ, మే 18 : పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన రిటైర్డ్ జవాన్ దేవేందర్ మృతదేహానికి మంగళవారం మంత్రి పూలమాల వేసి ని వాళులర్పించారు. అలాగే రెండు రోజుల కిందట టీఆర్ఎస్ నాయకుడు రాముగౌడ్, శ్రీనివాసులు తల్లి అంజిల మ్మ, చంద్రమ్మ మృతిచెందగా, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, రైతుబం ధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్, నాయకులు లక్ష్మయ్య, బాలయ్య, జంబులయ్య, రామణారెడ్డి, స త్యం, ఆంజనేయులు, పెంటయ్య, గంగాపురి పాల్గొన్నారు.