‘పల్లె ప్రగతి’తో మారిన రూపురేఖలు
సకల సౌకర్యాలు, సర్వహంగులతో ఆదర్శం..
చెత్తకుప్పలు, మురుగు మాయం
పారిశుధ్యానికి పెద్దపీటతో రోగాలు దూరం
రోడ్లకు ఇరువైపులా మొక్కలు.. ప్రకృతి వనంతో ఆహ్లాదం..
అద్దంలా రోడ్లు.. జిగేల్ మంటున్న వీధి దీపాలు..
వైకుంఠధామంతో తీరిన ఆఖరి మజిలీ తిప్పలు
ఉత్తమ సేవలకు కలెక్టర్, పలువురి ప్రశంసలు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని సారంగపల్లి కొత్తరూపును సంతరించుకున్నది. సర్వ హంగులూ సమకూర్చుకొని ఆదర్శంగా నిలుస్తుండడంతో జనం ‘మా సక్కని పల్లె’ అని కొనియాడుతున్నారు. గత ప్రభుత్వంలోని సమస్యలకు స్వస్తి పలికి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. సర్పంచ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తుల సమష్టి సహకారంతో అగ్రపథాన పయనిస్తున్నది. పచ్చని ప్రకృతి వనం, రోడ్లకు ఇరువైపులా ఆహ్లాదకరమైన పూల మొక్కలు, డంప్యార్డుల నిర్మాణం, శిథిలభవనాల కూల్చివేతతో పల్లె పరిశుభ్రతకు నిలయంగా మారింది. వైకుంఠధామం నిర్మాణంతో ఆఖరి మజిలీ కష్టాలు తొలిగిపోగా, గ్రామస్తుల్లో ఆనందం నెలకొన్నది. సీసీ కెమెరాలు ఏర్పాటుతోపాటు అన్నింటా ముందుంటూ కలెక్టర్తోపాటు పలువురి ప్రశంసలందుకున్నది. మిగతా మండలాలకు స్ఫూర్తిగా నిలవడంతో సర్పంచ్ ఎండీ ఫర్హీన్ సుల్తానాను అవార్డు వరించింది. ఆమె సేవలకు గుర్తింపుగా మార్చి 8, 2020న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో కలెక్టర్ భారతీ హోళికేరి చేతులమీదుగా ప్రశంసాపత్రంతోపాటు సత్కారం అందుకున్నారు.
మంచిర్యాల, మార్చి 15 (నమస్తే తెలంగాణ):మందమర్రి మండలంలోని సారంగపల్లి కొత్త రూపు సంతరించుకున్నది. సర్వ హంగు లూ సమకూర్చుకొని ఆదర్శంగా నిలుస్తుండడంతో జనం నోట ‘మా సక్కని తల్లి.. సారం గపల్లి’ అని ప్రశంసలందుకుంటున్నది. గత పాలకుల తీరుతో రాజ్యమేలిన సమస్యలకు స్వస్తి పలికి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. సర్పంచ్, ప్రజాప్రతి నిధులు, నాయ కులు, గ్రామస్తుల సమష్టి సహకారంతో అగ్రపథంలో పయనిస్తున్నది. ప్రకృతి వనం, డంప్యార్డు, శిథిలభవనాల కూల్చివేతతో పల్లె పరిశుభ్రతకు నిలయంగా మారింది. వైకుంఠ ధామం నిర్మాణంతో ఆఖరి మజిలీ కష్టాలు తొలగిపోగా, గ్రామస్తు ల్లో ఆనందం నెలకొన్నది. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు అన్నింటా ముందుంటూ కలెక్టర్తో పాటు పలువురి ప్రశంసలందుకున్నది.
సారంగపల్లి పంచాయతీ అన్ని రంగాల్లోనూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఒకప్పుడు పారిశుధ్య లోపంతో చెత్తాచెదారం పేరుకపోయి అస్తవ్యస్తంగా ఉన్న పల్లె నేడు అందంగా ముస్తాబ య్యింది. పంచాయతీలో 602 మంది పురుషు లు, 620 మంది మహిళలు కలిపి 1,222 మంది ఉన్నా రు. పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్, ప్రజాప్రతి నిధులు, గ్రామస్తులు, అధికారులు కృషి చేస్తున్నారు. రూ.1.90 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో గ్రామపంచాయతీ జంక్షన్లో హైమాస్ట్ లైటింగ్ను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు గ్రామ రక్షణకు తోడ్ప డుతుండగా, సమష్టి కృషితో ఆదర్శ పంచాయతీగా అవార్డును కూడా కైవ సం చేసుకున్నది. కాగా.. జనరల్ ఫండ్ కింద పంచాయతీకి రూ.1.70 లక్షలు, ఏడాదికి టీఎఫ్సీ నిధులు రూ.18.95 లక్షలు, స్టేట్ ఫైనాన్స్ నిధులు రూ.8.60 లక్షలు వస్తుండగా పంచాయతీ అభివృద్ధికి వినియోగిస్తున్నారు.
పారిశుధ్యానికి పెద్దపీట..
పారిశుధ్య నిర్వహణలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ 622 తడి-పొడి బుట్టలను వితరణగా ఇచ్చి చెత్తను సేకరిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణకు ట్రాక్టర్ చాలా ఉపయోగపడుతున్నది. రోజు ఉదయం పారిశుధ్య సిబ్బంది చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామ పొలిమేరలో ఉన్న డంప్ యార్డుకు తరలిస్తున్నారు. రోజు గ్రామంలోని చెత్తాచెదారాన్ని, మురుగు కాలువలు శుభ్రం చేసిన అనంతరం పక్కన ఉంచిన మట్టిని ట్రాక్టర్ ట్రాలీ సహాయంతో డంప్యార్డుకు చేరవేస్తున్నారు. చెత్త సేకరణకు ఒక ఆటో రిక్షా, ట్రాక్టర్ ట్రాలీ కూడాఉన్నాయి. రోడ్లన్నీ అద్దంలా మెరుస్తున్నాయి.పంచాయతీలో ముగ్గురు పారిశుధ్య కార్మికులు, ఒకరు రోజు వారీ కార్మికుడు ఉన్నారు. వీరంతా నిరంతరం శ్రమిస్తూ గ్రామంలో చెత్తాచెదారాన్ని తొలగించి అందంగా ఉంచుతున్నారు. వీరికి జీపీ ఏడాదికి రూ.3.20 లక్షల జీతం చెల్లిస్తున్నది. పారిశుధ్యం మెరుగ్గా ఉండడంతో వ్యాధులు కూడా ప్రబలడం లేదు.
ఇంటింటా మరుగుదొడ్డి..
గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిది ద్దారు. కంచె ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రకాల మొక్కలను నాటి, సంరక్షణ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని అంతర్గత రోడ్లకు ఇరువైపులా పూల మొక్కలను పెంచారు. వాటికి రోజూ నీరు పోస్తూ సంరక్షిస్తున్నారు. రహదా రుల వెంట ఉన్న మొక్కలు పూలతో ఆహ్లాదాన్ని పం చుతున్నాయి. గ్రామంలో వంద శాతం ఇంకుడు గుంతలు నిర్మించారు. నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుంటు న్నారు. గ్రామంలో ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి చొప్పున 311 నిర్మించారు. గ్రామంలో పల్లె ప్రకృతిలో భాగంగా రెండు శిథిల భవనాలను కూల్చివేశారు. నర్సరీలో మొక్కలను పెంచుతూ హరితహారానికి సిద్ధం చేస్తున్నారు. గ్రామంలో 109 విద్యుత్ స్తంభాలున్నాయి. ప్రతి పోల్కూ ఎల్ఈడీ లైట్ ఉండగా, రాత్రుల్లో జిగేల్ మంటూ కాంతులీనుతున్నాయి.