మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
జిల్లా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, పరిశ్రమల, ఉద్యానవన శాఖల అధికారులతో సమీక్ష
హాజీపూర్, ఏప్రిల్ 20 : ప్రజలకు కల్తీలేని ఆహార పదా ర్థాలను అందించేందుకు ప్రధానమంత్రి చేపట్టిన చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి పథకం (పీఎంఎఫ్ఎంఈ) ద్వారా మహిళా సంఘాలను ప్రోత్సహించాలని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, పరిశ్రమల, ఉద్యానవన శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం మహిళా సంఘాల ద్వారా 7 వేల ఆహార శుద్ధి యూ నిట్లను నెలకొల్పాలని నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 845 యూనిట్లను గుర్తించామని, ఇప్పటి వరకు 215 యూనిట్లకు సంబంధించి డీపీఆర్లు ఆమో దం పొందాయని చెప్పారు. యూనిట్లు అన్నింటికీ పూర్తి స్థాయి నివేదికలు తయారు చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఈ పథకంలో 35 శాతం రా యితీ, 10 శాతం సభ్యుల వ్యక్తిగత పెట్టుబడి మినహా 55 శాతం బ్యాంక్ రుణం ద్వారా అందిస్తామన్నారు. సభ్యురాలు 2 బ్యాంక్ ఖాతాలు ఉండాలని, 36 నుంచి 40 కి స్తీల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
గ్రామ సంఘాల్లో తీర్మానం పొంది ఉండాలని, అభ్యర్థులు, లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు. 46 ఏళ్ల లోపు వయస్సు, ఆధార్ కార్డు కలిగి ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో సెర్ప్, పుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారి సౌజన్యంతో కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి 2025 వరకు కొనసాగించేందుకు నిర్ణయించిందన్నారు. పంటలు, పాలు మొదలైన వాటికి మద్దతు ధర కల్పించడం కోసం పరిశ్రమలు నెలకొల్పి, వీటి ద్వారా ఆహార విలువలను పెంచడం, గ్రామీణ వ్యవస్థలో చిన్న తరహా యూనిట్లను గుర్తించి, వారిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ఈ పథకం దోహద పడుతుందన్నారు. అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా డీఆర్డీఏ పీడీ శేషాద్రి, వ్యవసాయ అధికారి వీర య్య, పరిశ్రమల అధికారి అశోక్, లీడ్ బ్యాంక్ అధికారి హవేలి రాజు, ఉద్యానవన సాంకేతిక అధికారి సహజతో పాటు తదితరులు పాల్గొన్నారు.