వ్యాక్సినేషన్ వేగిరం.. 73,606 మందికి టీకా
మెదక్ జిల్లాలో 20 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్
సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బంది
సంగారెడ్డి, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నది. పీహెచ్సీ నుంచి జిల్లా కేంద్ర దవాఖాన వరకు ట్రేస్, టెస్టు, ట్రీట్ విధానం ద్వారా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నది. ప్రజలను అప్రమత్తం చేస్తూనే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగిరం చేసింది. మెదక్ జిల్లాలో 45 ఏండ్లు పైబడిన వారు 2 లక్షల మంది ఉండగా, శుక్రవారం వరకు 78,158 మందికి కరోనా వ్యాక్సినేషన్ వేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు వ్యాక్సిన్ సెంటర్లలో రద్దీ పెరుగుతున్నది. జిల్లాలో 20 రోజుల వ్యవధిలోనే 21 మంది మృత్యువాత పడ్డారు. మెదక్ కలెక్టరేట్లో కరోనా కంట్రోల్ రూం 08452-223360 ఏర్పాటు చేశారు.
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభు త్వం.. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నది. పీహెచ్సీ నుంచి జిల్లా కేంద్ర దవాఖాన వరకు మెరుగైన వైద్యసేవలు అం దేలా చర్యలు తీసుకుంటున్నది. వైద్య ఆరోగ్యశాఖ ట్రే స్, టెస్టు, ట్రీట్ విధానం ద్వారా కరోనా కట్టడికి చర్య లు తీసుకుంటున్నది. ప్రజలను కరోనాపై అప్రమత్తం చేస్తూనే మరోవైపు వ్యాక్సినేషన్ను వేగంగా అమలు చేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో ఎక్కడా కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాకు కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు పట్టణాలు, పల్లెల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నది. అన్ని ప్రాంతాల్లో రాత్రి కర్వ్యూను అమలు చేస్తున్నది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కరోనా కట్టడికి 24 గంటలు పనిచేస్తున్నారు. పీహెచ్సీ మొదలుకొని జిల్లా కేంద్ర దవాఖాన, కొవిడ్ సెంటర్లలోని వైద్యులు, సిబ్బంది మెరుగైన వైద్యసేవలు అందజేస్తున్నారు.
కరోనా పాజిటివ్ రేటు 12 శాతం..
సంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్ రేటు 12 శాతంగా ఉంది. ముమ్మరంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అధికారుల సమాచారం మేరకు ప్రతిరోజు 4వేల యాంటిజెన్ టెస్టులు, 300 ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీ, జిల్లాకేంద్ర దవాఖాన మొత్తం 39 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న రోగులు తమ ఆధార్కార్డు నంబర్, ఫోన్ నంబర్ తీసుకుని పీహెచ్సీ, సీహెచ్సీ, జిల్లా దవాఖానలో కరోనా నిర్ధారణ సెంటర్లో తమ పేరు నమోదు చేయించుకోవాలి. ఆన్లైన్లో పేరు రిజిష్టర్ చేసిన తర్వాత వైద్య సిబ్బంది యాంటిజెన్ లేదా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టు ఫలితాలను అదేరోజు తెలియజేస్తారు. పాజిటివ్ వస్తే వెంటనే కరోనా కిట్ అందజేసి ఐసోలేషన్లో ఉండేలా వైద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీపీఆర్ నమూనాలను హైదరాబాద్లోని ఫివర్ దవాఖానకు పంపుతున్నారు.
రెండు రోజుల తర్వాత ఫలితాలు వస్తున్నాయి. పదిరోజుల్లో సంగారెడ్డిలోని ప్రభుత్వ దవాఖానలో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. దీంతో స్థానికంగా ఫలితాలు వెంటనే తెలియనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 11,924 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 185 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వారికి చికిత్స అందజేస్తున్నారు. 11,924 పాజిటివ్ కేసుల్లో 8954 మంది కోలుకోగా, 2893 మంది హోం ఐసొలేషన్లో ఉన్నారు. ఆరుగురు దవాఖానల్లో చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకు 74 మంది కరోనాతో మృతిచెందారు. పాజిటివ్ వచ్చిన వారిని హోం ఐసోలేషన్లో ఉంచి అవసరమైన మందులు అందజేస్తున్నారు. అత్యవసరమైతే సంగారెడ్డిలోని కరోనా సెంటర్లో చేర్చుకుని చికిత్స అందజేస్తున్నారు. సంగారెడ్డి దవాఖానలో కరోనా పాజిటివ్ రోగుల కోసం అవసరమైన ఆక్సిజన్, 50 బెడ్స్ను అందుబాటులో ఉంచారు. జిల్లాలో కరోనా రికవరీ రేటు 95 శాతంగా ఉంది.
నిరంతర వైద్యసేవలు..
కరోనా నిర్ధారణ పరీక్ష మొదలు, కరోనా సోకిన వారికి చికిత్స అందజేయడంలో వైద్యులు, సిబ్బంది ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. మంత్రి హరీశ్రావు, కలెక్టర్ హనుమంతరావు ఎప్పటికప్పుడు కరోనా కట్టడి చర్యలు, వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. పీహెచ్సీ మొదలు జిల్లా దవాఖాన వరకు 168 వైద్యులు, సిబ్బంది 24 గంటలు సేవలందిస్తున్నారు. వీరిలో వైద్యులు 47 మంది, స్టాఫ్ నర్సులు 190, నర్సులు 36, సూపర్వైజర్లు 100, ఆశవర్కర్లు 940 మంది పనిచేస్తున్నారు. వీరితో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు, ఆర్బీఎస్కే సిబ్బంది 46 మంది పనిచేస్తున్నారు. వైద్యుల కృషి ఫలితంగా కరోనా రికవరీ రేటు సంగారెడ్డి జిల్లాలో 95శాతంగా ఉంది.
10,4829 మందికి వ్యాక్సిన్..
సంగారెడ్డి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. జిల్లాలోని 41 ప్రభుత్వ దవాఖాన, ఎనిమిది ప్రైవేట్ దవాఖానల్లో ప్రతిరోజు టీకా వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,04,829 మందికి టీకా వేశారు. ప్రతిరోజు 4వేల మందికి టీకా వేస్తున్నారు. ఇప్పటి వరకు మొదటి డోస్ను 93,322 మంది వేసుకోగా, 11507 మంది రెండో డోసు టీకా వేసుకున్నారు. జిల్లాలో 12వేల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి. టీకా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వైద్య సిబ్బంది 7196 మందికి మొదటి డోస్, 5255 రెండో డోస్ టీకా తీసుకున్నారు. కరోనా ఫ్రంట్లైన్ వారియర్లు 9620 మంది మొదటి డోస్, 3860 మంది రెండో డోసు టీకా వేసుకున్నారు. 60 ఏండ్లు పైబడిన వారు 28,418 మంది మొదటి డోస్, 1038 మంది రెండో డోస్ టీకా తీసుకున్నారు. 60 ఏండ్ల లోపు ఉన్నవారిలో 48,088 మంది మొదటి డోస్, 1354 మంది రెండో డోస్ టీకా వేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
బిగ్ బాస్ ఆఫర్ కు నో చెప్పిన ఇంద్రజ..కారణమిదే..!
రకుల్ పింక్, బ్లాక్ అవుట్ఫిట్ అందాలు అదరహో..!
విజయ్ మాస్టర్ సినిమాకు ఊహించని షాక్