ఐటీసీ టెక్నికల్ బృందంతో కలిసి సందర్శించిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నివేదిక అందజేసిన ఐటీసీ బృందం
మంగపేట, ఏప్రిల్ 27 : మండలంలోని కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ను ములుగు కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఐటీసీ (ఇండియన్ టుబాకో కంపెనీ) పేపర్ పరిశ్రమ అడ్మినిస్ట్రేటివ్ అధికారి చెంగల్రావు, టెక్నికల్ మేనేజర్ శ్రీపతి మంగళవారం పరిశీలించారు. బిల్ట్ ఆక్సిజన్ ప్లాంట్ను వినియోగంలోకి తీసుకురావాలని ఈనెల 26న జడ్పీ చైర్మన్ సీఎంతో పాటు, కలెక్టర్కు లేఖ రాసిన విషయం విధితమే. ఈ నేప థ్యంలో కలెక్టర్, టెక్నికల్ టీం సభ్యులు ప్లాంట్ను సంద ర్శించారు. ముందుగా టెక్నికల్ బృందం ప్లాంట్ను పరిశీ లించి దాని సామర్థ్యం గురించి కలెక్టర్కు వివరిస్తూ నివే దిక అందజేశారు. ప్లాంట్ కేవలం 93 శాతం ఆక్సిజన్ సామర్థ్యం కలిగి ఉందని, 105 శాతం సామర్థ్యం ఉంటేనే ప్రాణవాయువుగా ఉపయోగించవచ్చని తెలిపారు. 2014 నుంచి ప్లాంట్ నిలిచి పోవడంతో చాలా వరకు మరమ్మ తు లు అవసరమవుతాయని చెప్పారు. విద్యుత్, నీటి సర ఫరా అవసరం ఉందని తెలిపారు. ప్లాంట్ను పూర్తి స్థాయి లో వినియోగంలోకి తీసుకురావడానికి ఎంత ఖర్చు అవు తుందనే అంశంపై త్వరలో నివేదిక ఇస్తామని ఐటీసీ టెక్నికల్ అధికారులు కలెక్టర్కు వివరించారు.
బిల్ట్ దవాఖానను ఐసొలేషన్ కేంద్రంగా మార్చండి
కమలాపురం బిల్ట్ కాలనీలో ఉన్న దవాఖానను ఐసొలే షన్ కేంద్రంగా మార్చాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఎంపీడీవో ఇక్బాల్హుస్సేన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ ఆదర్శ సురభి, పీవో హన్మంత్ కే జండ గేతో కలిసి ఆయన దవాఖానను పరిశీలించారు. 50వేలకు పైగా జనాభా ఉన్న మండలంలో కనీసం 30 బెడ్ల ఐసొ లేషన్ సెంటర్ ఉండాలన్నారు. ఇందుకు అవసరమైన విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీరు ఇతర ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్ల గురించి అడి గి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీవో శ్రీకాంత్, ఆర్ఐలు కామేశ్వర్రావు, సునీల్ పాల్గొన్నారు.