‘డయల్ యువర్ ఎమ్మెల్యే’కు విశేష స్పందన
20 ఫోన్ కాల్స్ను స్వీకరించిన ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్, ఏప్రిల్ 17 : నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు తాగునీటి సమస్యపై డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి 20 ఫోన్ కాల్స్ వచ్చాయి. వికారాబాద్ నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి వచ్చిన తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే నేరుగా కాల్స్ను స్వీకరించి వారికున్న సమస్యలను స్పష్టంగా తెలుసుకుని నివృత్తి చేశారు. రానున్న రెండు నెలలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అధికంగా ఉంటుందని.. ముందస్తు చర్యల్లో భాగంగా మిషన్ భగీరథ అధికారులతో కార్యక్రమం నిర్వహించామని ఎమ్మెల్యే తెలిపారు. 90 శాతం మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయని, కేవలం 10 శాతం పనులు అక్కడక్కడ మిగిలిపోయాయని పేర్కొన్నారు. వాటిని కూడా వెంటనే పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో డీఈ రత్నప్రసాద్, కిరణ్కుమార్, ఏఈలు ఉత్కర్శర్మ, శివ, మురళి, వేణుమాధవ్, చేతన్, దరిగౌడ్, అనిరుద్దీన్, నయనశ్రీ పాల్గొన్నారు. వికారాబాద్లో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నందున త్వరలో మిషన్ భగీరథపై మున్సిపాలిటీలో డయల్ యువర్ ఎమ్మెల్యే నిర్వహించనున్నట్లు తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
మర్పల్లి, ఏప్రిల్ 17 : సీఎం సహాయనిధి పేదకుటుంబాలకు వరమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మండలంలోని ఘనాపూర్ గ్రామానికి చెందిన పాషామియా కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందగా.. సీఎం సహాయ నిధి నుంచి రూ.60వేలు వచ్చాయి. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆనంద్ సీఎంఆర్ఎఫ్ చెక్కును పాషామియాకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బిచ్చయ్య పాల్గొన్నారు.