బేగంపేట్: విద్యార్థులకు కొవిడ్ వ్యాక్సిన్ వేయడం ద్వారా ప్రత్యక్ష తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎలక్ట్రికల్ విభాగం ఆచార్యులు జీ.మల్లెశం అన్నారు. బేగంపేట్ మహిళ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్ఎస్ఎస్, ఐక్యూఏసీ సంయుక్తాధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రన్సిపాల్,ఎన్ఎస్ఎస్ చైర్ పర్సన్ డాక్టర్ కె పద్మావతి, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి, ప్రోగ్రాం ఆఫిసర్స్ కె వెంకటేశ్వర్లు, మాధురి తదితరులు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా వక్తలు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని తద్వారా కరోనా బారినుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కాలేజీలో 262 మంది విద్యార్థులకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ను వేసినట్టు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ విభాగం అధికారులు రాజేశ్వరి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.