పది మంది మహిళా సభ్యులతో ఒక గ్రూపు
ఇప్పటికే 1,441 సంఘాల ఏర్పాటు
ఈ నెలాఖరు వరకు గడువు
దండేపల్లి, మార్చి 15 : మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సర్కారు స్వయం సహాయక సంఘాలు (ఎస్హె చ్జీ) ఏర్పాటు చేసింది. అతివలు పొదుపు మంత్రం పాటిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. చాలా మంది గ్రూప్గా ఏర్పడి కుటీర పరిశ్రమలు, వ్యక్తిగతంగా దుకాణాలు నిర్వహిస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఈ క్రమంలో సర్కారు కొత్త సంఘాల ఏర్పాటునకు అవకాశం కల్పించింది. సెర్ప్ సభ్యులు సర్వేలు నిర్వ హించి కొత్త గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు అవకాశం ఉం డగా.. పొదుపు ఎలా చేయాలో సీఆర్పీలతో శిక్షణ ఇస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు, ఆర్థిక సాధికారత సాధించేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సర్కారు స్వ యం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)లను ఏర్పాటు చే సింది. ఓటరు జాబితా ఆధారంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 18-58 ఏండ్ల వయస్సు గల వారిని సభ్యులుగా చేర్చారు. ప్రతి గ్రూపులో కూడా 10-12 మంది సభ్యులు సంఘంగా ఏర్పడి పొదుపు బాట పట్టారు. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 8,755 గ్రూపులు ఉండగా.. 99,813 మం ది సభ్యులు ఉన్నారు. వీటిలో అనివార్య కారణాల వల్ల ఖా ళీ ఏర్పడిన వారిని కూడా భర్తీ చేశారు. 485 గ్రూపుల్లో 907 మందిని సభ్యులుగా చేర్చారు.
పొదుపు చేస్తే రుణం..
కొత్తగా ఏర్పాటైన గ్రూపు పేరిట ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరుస్తారు. మహిళా సంఘాలు క్రమం తప్పకుండా పొదు పు సొమ్ము బ్యాంకుల్లో జమ చేస్తే లక్షల్లో రుణం పొందే అవకాశం ఉంది. తొలిసారిగా ప్రతి సంఘానికి రూ. 75వేలు ఇస్తారు. దీనిని క్రమం తప్పకుండా చెల్లిస్తే రూ.5 లక్షల వరకు మంజూరవుతాయి. పొదుపు సంఘాల్లో ఉ న్న సభ్యులు ప్రతి నెలా రూ.100 చొప్పున ఆరేళ్లపాటు రూ.7,200 చెల్లించి శ్రీనిధి రుణం పొందడానికి అవకాశం ఉంటుంది. దీనికి నెలనెలా వడ్డీ వస్తుంది. ఈ నిధి నుంచి అత్యవసరాలకు రుణం తీసుకోవచ్చు. ఒక స భ్యురాలికి రూ.25 వేల వరకు గరిష్ఠంగా మంజూరు చేస్తారు. ఇవీ 13 శాతం వడ్డీతో 24 కిస్తీల్లో చెల్లించాలి. కాగా.. చా లా మంది మహిళలు రుణాలు తీసుకొని స్వయం ఉపాధి కి బాటలు వేసుకుంటున్నారు. కొందరు మహిళలు సమష్టిగా ఏర్పడి కుటీర పరిశ్రమలు స్థాపిస్తున్నారు. మరి కొందరు పేపర్ గ్లాస్, ప్లేట్ల తయారీ చేస్తూ.. దుస్తులు, బేక రీ దుకాణాలు నిర్వహిస్తూ.. గేదెలు, మేకలు పెంచుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.
1,441 కొత్త సంఘాల ఏర్పాటు
స్వయం సహాయక సంఘాల్లో మరికొందరు మహిళలకు అ వకాశం కల్పించాలని సర్కారు సంకల్పించింది. ఈ మేరకు పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)కు బాధ్యతలు అప్పగించారు వీరు డిసెంబర్ 5, 2020 నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. ఓటరు జాబితా ఆధారంగా 18 ఏండ్లు దాటిన మహిళలను గుర్తించి పది మందికి ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ 1,441 సంఘాలు ఏర్పాటు చేయగా.. 14,433 మంది సభ్యులుగా చేరారు. ఇంకా క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారుల సహకారంతో నూతన గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. ఎంపిక ప్రక్రియ ఈ నెల చివరి వరకు కొనసాగనున్నది. కొత్తగా ఏర్పాటైన గ్రూపు సభ్యులకు పొదుపు, ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించేందుకు వ్యాపార కార్యకలాపాల ఏర్పాటు, దస్ర్తాల నిర్వహణ, బ్యాంకు లింకేజీ రుణాలు, నాయకత్వం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ నెలాఖరు వరకు కొనసాగనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పడ్డ సంఘాలపై ఆరు నెలలపాటు ఏపీఎంల పర్యవేక్షణ ఉంటుంది.
మహిళలకు ఆర్థిక భరోసా..
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రోత్సహిస్తున్నాం. ఈ నెలాఖరు వరకు కొత్త సంఘాల ఏర్పాటుకు గడువు ఉంది. కొత్త గ్రూపులు ఆర్థికాభివృద్ధి సాధిండానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో 1,4 41 కొత్త గ్రూపులు ఏర్పాటు చేశాం. మరిన్ని గ్రూపుల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నాం.
-శేషాద్రి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి
ప్రతి మహిళా సంఘంలో చేరాలి..
గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్వాక్రా గ్రూ పుల్లో ప్రతి మహిళా సభ్యురాలిగా చేరాలి. సం ఘంలో చేరినప్పుడే మహిళలకు ఆర్థిక స్వాతం త్య్రం లభిస్తుంది. ఇప్పటికే చాలా మంది సంఘా ల్లో చేరి దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. కొత్తవారు కూడా చేరాలి.
స్వర్ణలత, డీపీఎం