భకులు లేకుండా సాగిన సీతారాముల కల్యాణం
కల్యాణానికి కరోనా నిబంధనల పాటిస్తూ హాజరైన ప్రజాప్రతినిధులు
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 21: కరోనా నిబంధనలకు లోబడి జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో భక్తులకు అనుమతి లేకుండా బుధవారం నిరాడంబరంగా వేద పండితులు కల్యా ణం నిర్వహించారు. సీతారామ కల్యాణంలో ఆలయ పూజరులు మధుసూదన్చారి, కృష్ణమూర్తి, లక్ష్మణ్చారి, ఆలయ కమిటీ సభ్యులు నగరం మల్లేశం, నందిని శ్రీనివాస్, దేవేందర్రెడ్డి, చకిలం శ్రీనివాస్, పురుషోత్తంలతో పాటు మున్సిపల్ కౌన్సిలర్ జయశ్రీ దుర్గప్రసాద్, ప్రశాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి…
సీతారామ కల్యాణం అనంతరం సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కోదండ రామాలయ ప్రధాన పూజారి మధుసూదన్చారి తెలిపారు. మానవ సమాజం కరోనా నుంచి విముక్తి చెందాలని భగవంతున్ని కోరినట్లు తెలిపారు.
మండల కేంద్రంతో పాటు…
పాపన్నపేట,ఏప్రిల్ 21: మండల కేంద్రంతో పాటు లక్ష్మీనగర్లో శ్రీరామనవమి పురస్కరించుకొని వేంకటేశ్వర ఆలయం ప్రాంగణంలో సీతారాముల కల్యాణానికి భక్తులు పదుల సంఖ్యలో హాజరై తిలకించారు. పాపన్నపేటటో సాయంత్రం శ్రీ వేంకటేశ్వరస్వామి, వీరభద్రస్వామి ఆల య ం చుట్టూ బండ్లు ఊరేగింపు నిర్వహించారు.ఈకార్యక్రమం లో ఉత్సవ కమిటీ సభ్యులు రాజేశ్వర్, కిషన్రెడ్డి, మల్లన్న, రాములు సర్పంచ్ గురుమూర్తిగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు
పెద్దశంకరంపేట…
పెద్దశంకరంపేట,ఏప్రిల్ 21: కరోనా నైపథ్యంలో పెద్దశంకరంపేట రామాలయంలో భక్తులు లేకుండా సీతారాముల కల్యాణం నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామంలో ఎవ్వరూ రావద్దని అధికారులు, ప్రజాప్రతినిధులు చాటింపు వేయడంతో ప్రజలు హాజరు కాలేదు. కల్యాణం అనంతరం ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు స్వామి వారిని దర్శించుకున్నారు.
హవేళిఘనపూర్…
హవేళిఘనపూర్, ఏప్రిల్ 21: మండల పరిధిలోని తొగిట రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కల్యాణోత్సవం కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మంద శ్రీహరి, ఆల య కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట…
చిన్నశంకరంపేట, 21 ఏప్రిల్: చిన్నశంకరంపేటతో పాటు వివిధ గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలను భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చేగుంట …
చేగుంట ఏప్రిల్21: శ్రీరామ నవమి సందర్భంగా మండల పరిధిలోని పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణం భక్తి శ్రద్ధలతో నిరాడంబరంగా నిర్వహించారు. చేగుంటలోని హనుమాన్ దేవాలయంలో,కర్నాల్పల్లి . రెడ్డిపల్లిలోని మక్కరాజిపేట, నార్సింగ్లోని తదితర గ్రామాల్లో సీతారాముల కల్యా ణం కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయపూజారులు నిర్వహించారు. కార్యక్రమంలో సాయిబాబాగుడి చైర్మన్ తుమ్మ యాదగిరి రేఖ,ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ వంటరి కొండల్రెడ్డి, రెడ్డిపల్లి సర్పంచ్ లక్ష్మీజ్ఞానేశ్వర్గౌడ్, చెప్యాల మల్లేశం ఆలయ కమిటీ సభ్యులుపాల్గొ న్నారు.