ఊరూరా రసాయనాల పిచికారీ
జాగ్రత్తలు పాటించాంటూ ప్రజలకు సూచనలు
గ్రామాల్లో జోరుగా పారిశుధ్య కార్యక్రమాలు
నర్సంపేట: ప్రజలు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని నర్సంపేట మున్సిపల్ కౌన్సిలర్ రాయిడి కీర్తిదుశ్యంత్రెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ చెత్తను ఎవరూ ఆరుబయట వేయొద్దని, మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు.
కరోనాపై అప్రమత్తంగా ఉండాలి
పరకాల: కరోనా వైరస్పై అప్రమత్తంగా ఉండాలని 14వ వార్డు కౌన్సిలర్ మార్క ఉమాదేవి అన్నారు. కరోనా కట్టడికి వార్డు పరిధిలోని ఆలయాలు, మసీదుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వార్డు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉంటే డాక్టర్ల సలహా మేరకు హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించారు. 45 ఏళ్లు దాటిన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకుడు రఘుపతిగౌడ్ ఉన్నారు.
చెన్నారావుపేట: మండలంలోని జల్లి, సూర్యాపేటతండా, అమీనాబాద్, కోనాపురం, ఉప్పరపల్లి, చెన్నారావుపేటలో పారిశుధ్య పనులు చేశారు. చెన్నారావుపేటలో కార్యదర్శి బాలకిషన్గౌడ్ ఆధ్వర్యంలో డ్రైనేజీలను శుభ్రం చేయించారు. అలాగే, వీధుల్లో రసాయనాలను పిచికారీ చేశారు. పాపయ్యపేటలోని వీధుల్లో సర్పంచ్ ఉప్పరి లక్ష్మి సమక్షంలో కార్యదర్శి శ్యామ్ జీపీ కార్మికులతో రసాయనాలను పిచికారీ చేయించారు.
ప్రజలు భాగస్వాములు కావాలి
దుగ్గొండి: కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య పిలుపునిచ్చారు. మండలకేంద్రంతో పాటు తొగర్రాయి, వెంకటాపురంలో సర్పంచ్లు తోకల మంజుల-నర్సింహారెడ్డి, ఓడేటి తిరుపతిరెడ్డి, హింగోళి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. తొగర్రాయిలో జీపీ నిధులతో కొనుగోలు చేసిన రసాయనాల పిచికారీ యంత్రాన్ని ఎంపీపీ ప్రారంభించారు.
నల్లబెల్లి: మండలంలో కరోనా నివారణ చర్యలు చేపట్టారు. అన్ని గ్రామాల్లో రసాయనాలను పిచికారీ చేయిస్తున్నారు. మల్టీపర్పస్ వర్కర్లు వీధుల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించాలని ప్రజలను కోరుతున్నారు.