జోరుగా కొవిడ్-19 పరీక్షలు
రోజురోజుకూ వ్యాక్సిన్లపై పెరుగుతున్న స్పందన
పరిగి, ఏప్రిల్ 22 : కరోనా కట్టడి కోసం అవసరమైన అన్ని చర్యలను మున్సిపల్ ఆధ్వర్యంలో తీసుకుంటున్నామని 4వ వార్డు కౌన్సిలర్ వారాల రవీంద్ర పేర్కొన్నారు. గురువారం వార్డు పరిధిలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రజలు సైతం తమవంతు సహకారం అందించాలన్నారు. పనిలేకపోతే ఇండ్ల నుంచి బయటకు రావద్దని, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు.
పెద్దేముల్ మండలంలో 10 పాజిటివ్ కేసులు నమోదు
పెద్దేముల్, ఏప్రిల్ 22 : మండలంలో గురువారం 100 మందికి పరీక్షలు 10 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి డా.శ్రవణ్కుమార్రెడ్డి తెలిపారు. గాజీపూర్లో 1, తాండూరులో 1, ఇందూరు 0, నాగసమందర్ 1, పెద్దేముల్ 3, బండపల్లి 1, మన్సాన్పల్లి 1, మారేపల్లిలో ఒక్కరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 70 మందికి కొవిడ్ టీకాలను వేసినట్లు చెప్పారు.
కరోనా కట్టడికి చర్యలు
దోమ, ఏప్రిల్ 22 : కరోనా కట్టడికి ప్రత్యే చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్లు రాజిరెడ్డి, దొడ్ల అంజిలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం దోమలో సర్పంచ్ రాజిరెడ్డి వీధులు, రోడ్ల వెంబడి ట్రాక్టర్ సహాయంతో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించగా, మల్లేపల్లి గ్రామంలో దొడ్ల అంజిలయ్య డ్రైనేజీలు, వార్డుల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని చేతి పంపు సహాయంతో పిచికారీ చేయించారు.
పరిగి మండలంలో 54 మందికి..
పరిగి, ఏప్రిల్ 22 : పరిగి సీహెచ్సీ, చిట్యాల్ పీహెచ్సీల పరిధిలో గురువారం 266 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 54 మందికి పాజిటివ్గా నిర్దారణ అయిందని చిట్యాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గౌసొద్దీన్ తెలిపారు. పరిగిలో 14, బర్కత్పల్లి 3, తుంకులగడ్డ 5, సయ్యద్పల్లి 1, రూప్ఖాన్పేట్ 5, కాళ్లాపూర్తండా 5, నస్కల్ 3, రావులపల్లి 3, కాళ్లాపూర్ 1, నారాయణపూర్ 2, నజీరాబాద్తండా 2, ఎర్రగడ్డపల్లి 1, బసిరెడ్డిపల్లి 2, పెద్ద మాదారం 1, గడిసింగాపూర్ 1, తొండపల్లిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.