కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
మూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 9 : కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ సభ్యులు గ్రామస్తులందరినీ సమన్వయం చేసుకొని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పాలక మండలి చైర్మన్ దండు కృష్ణారెడ్డి, కమిటీ సభ్యులు శ్రీనివాసాచారి, జయసుందర్రెడ్డి, పిల్లి కొండన్న, గొల్ల తిరుపతయ్య, వట్టెం రాములమ్మ, ఓపాల మాసన్నతో ప్రమాణం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే ఆల నూతన కమిటీ సభ్యులను శాలువాతో సన్మానించారు. ఆలయ పాలకమండలి సభ్యులు భక్తులను సమానంగా చూడాలని సూ చించారు. ఆలయ ప్రాంగణంలోని కోనేరులో మెట్ల నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే చెప్పా రు. కార్యక్రమంలో ఎంపీపీ దోనూరు నాగార్జున్రెడ్డి, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, మాజీ జెడ్పీటీసీ రామన్గౌడ్, వైస్ఎంపీపీ రాచాల రాధిక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, లక్ష్మీనర్సింహయాదవ్, సింగిల్విండో చైర్మన్ మద్దూరి జితేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షు డు తిరుపతిరెడ్డి, సర్పంచ్ శ్రీకాంత్, ఎంపీటీసీ శ్యామలమ్మ, నాగిరెడ్డి, చల్మారెడ్డి, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చలివేంద్రం ప్రారంభం
కందూరు రామలింగేశ్వరస్వామి జాతరలో ఎంపీటీసీ సుశీలమ్మ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు రామలింగేశ్వరస్వామి ఆలయానికి కందూరు గ్రామవాసి తమ్మళి సీతమ్మ అందజేసిన రూ.18వేల విలువైన తాగునీటి శుద్ధి యం త్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ఎంపీటీసీ కుటుంబ సభ్యులను అభినందించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
చిన్నచింతకుంట మండలం అల్లీపూర్కు చెందిన సాయికుమార్ కొన్నిరోజుల కిందట ఈతకు వెళ్లి మృతి చెందాడు. అతడి కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.లక్ష చెక్కును శుక్రవారం అన్నాసాగర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అందజేశా రు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.