తల్లికి బుక్కెడు అన్నం పెట్టని కొడుకులు
గ్రామంలోని కోడళ్ల వద్ద ఆశ్రయం
వాళ్లూ గెంటేయడంతో ఊరి చివర బతుకు
చేరదీసిన పోలీసులు
ముత్తారం, ఏప్రిల్ 27: నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లికి బుక్కెడు అన్నం పెట్టడమే కొడుకులకు భారమైపోయింది. మలివయసులో అండ గా ఉండాల్సింది పోయి ‘నువ్వంటే నువ్వు చూసు కో’ అంటూ ఇంటి నుంచి వెళ్లగొట్టిన ఘటన లక్కారంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెంది న రాజమ్మకు నలుగురు కొడుకులు. ఇందులో రెండో కొడుకు బాపు, చిన్న కొడుకు సారయ్య గ తంలో చనిపోయారు. ఉన్న పెద్ద కొడుకు రాజ య్య సింగరేణిలో పని చేసి విరమణ పొంది. రా మగిరి మండలం బేగంపేట ఎక్స్రోడ్డు వద్ద ఇల్లు తీసుకొని ఉంటున్నాడు. మూడో కొడుకు శంకర్ కోరుట్లలో ఉంటున్నాడు. కొడుకులు తల్లిని సాకడం భారంగా భావించారు. కొంతకాలంగా కొడుకులు, గ్రామంలోని ఇద్దరు కోడళ్లు (మృతిచెందిన కొడుకుల భార్యలు) ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కొడుకులు ఏడాది కిందే పట్టించుకోవడం మానేయగా, గ్రామంలోని కోడళ్లే సాకుతూ వచ్చారు. ఈ విషయమై రాజమ్మ ఇప్పటికే ఎస్ఐ నరసింహారావు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా, ఇద్దరు కొడుకులకు ఫోన్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. సమస్యను పరిష్కరిస్తున్న సమయంలోనే మంగళవారం ఆ ఇద్దరు కోడళ్లు సైతం ఆమెను ఇంటి నుంచి వెళ్లిపొమ్మనడంతో ఊరి శివారుకు వెళ్లి తలదాచుకుంటున్నది. ఈ విషయమై రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మే రకు మంథని సీఐ మహేందర్ రెడ్డి, ముత్తారం ఎస్ఐ నరసింహారావు మంగళవారం గ్రామానికి వచ్చి ముసలమ్మను చేరదీశారు. కొడుకులు, కోడళ్లతో సీఐ ఫోన్లో మాట్లాడి కౌన్సెలింగ్ కోసం స్టేషన్కు రావాలని సూచిస్తూనే, అప్పటిదాకా రాజమ్మను చూసుకోవాలని చిన్న కోడలు వనితకు సూచించారు. జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ వర ప్రసాద్ ఉన్నారు.
పోలీసుశాఖ ఆదుకుంటుంది..
కొద్దిరోజుల క్రితమే రాజమ్మ మా వద్దకు వచ్చి సమస్యను చెప్పుకుంది. కొడుకులు ప ట్టించుకోవడం లేదని వాపోయింది. ఫోన్లో ఆమె ఇద్దరు కొడుకులకు కౌన్సెలింగ్ ఇచ్చాం. సమస్యను పరిష్కరిస్తున్న సమయంలోనే గ్రా మంలోని ఇద్దరు కోడళ్లు సైతం తాము సాకలేమని వెళ్లగొట్టడంతో గ్రామానికి వెళ్లి ఆ తల్లిని చేరదీశాం. వాళ్లు ముందుకువచ్చినా రాకున్నా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆ మాతృమూర్తికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం.