తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అంగన్వాడీలకు అండగా నిలిచింది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేస్తున్నది. అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచింది. గత పాలకుల హయాంలో వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తే నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. సీఎం కేసీఆర్ రెండు పర్యాయాలు వేతనాలను పెంచారు. ప్రస్తుతం మెయిన్ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు నెలకు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రూ.7,600 వరకు రాష్ట్ర సర్కార్ వేతనాలను పెంచింది. దివ్యాంగులు, డ్రాపౌట్స్కు ఇటీవల న్యూట్రిషన్ కిట్స్ పంపిణీని ప్రారంభించింది. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ అమలు చేయాలని వారు అభిప్రాయపడుతున్నారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
సీఎం కేసీఆర్ అడగకుండానే వేతనాలను పెంచి అందరివాడయ్యాడని.. తమ సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారని పలువురు అంగన్వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని, చాలీచాలని వేతనాలతో జీవించామని పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి.. కేసీఆర్ సీఎం అయిన తర్వాత అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచి, అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే అంగన్వాడీ టీచర్లతోపాటు దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, దేశం సుభిక్షంగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
సీఎం కేసీఆర్తోనే దేశంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్రం దేశం లోనే ఆదర్శంగా నిలిచింది. సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఒక రోల్ మోడల్ తెలంగాణ. దేశ అభివృద్ధి, వనరుల లభ్యత వాటి వినియోగంపై స్పష్టమైన అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే. స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా దేశంలో ఇంకా చెప్పుకోదగ్గ అభివృద్ధి జరుగలేదు. మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పోరాడి సాధించుకున్న తెలంగాణను ఆయన ఎనిమిదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అనేక పథకాలను అమ లు చేస్తూ అందరికీ అండగా నిలుస్తున్నారు.
-ప్రవీణ, అంగన్వాడీ టీచర్, చేవెళ్ల గ్రామం, చేవెళ్లటౌన్
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ విద్య, వైద్యం రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారు. ప్ర భుత్వ ఉద్యోగులతోపాటు అంగన్వాడీ టీచర్లకు కూడా వేతనాలను పెంచి సంతోషాన్ని నింపారు. ఇలాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి.
-శ్రీదేవి, అంగన్వాడీ టీచర్, షాద్నగర్ టౌన్
భావితరాలు బాగుపడాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించేవరకూ ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడంలేదు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షే మ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు లాంటి పథకాలు అర్హులందరికీ అందుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశవ్యాప్తంగా ఈ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయి.
-సుధామణి, అంగన్వాడీ టీచర్ నల్లచెరువు గ్రామం, మాడ్గుల మండలం
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తేనే బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సేవలు దేశానికి ఎంతో అవసరం. అనతి కాలంలోనే రాష్ర్టాన్ని ఎలా అభివృద్ధి చేశారో అదేవిధంగా దేశం కూడా ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలో పక్కాగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. జాతీ య రాజకీయాల్లో తన కంటూ ప్రత్యేక సత్తాను ఆయన చాటుతారు. అప్పట్లో పీవీ నర్సింహారావు ప్రధానిగా దేశాభివృద్ధికి కృషి చేశారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ కూడా ప్రధాని కావాలి. అందరికీ సంక్షేమ పథకాలను అందించాలి.
-హంస ,అంగన్వాడీ టీచర్, చిట్టిగిద్ద గ్రామం, నవాబుపేట
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి.. కేసీఆర్ సీఎం అయిన తర్వా తే అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మారాయి. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో చాలీచాలని వేతనాలతో బతకడం భారంగా ఉండేది. సీఎం కేసీఆర్ తమతోపాటు ఆయాల వేతనాలనూ పెంచి ఆదుకున్నారు. అంతేకాకుండా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించే ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఇలాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశం సుభిక్షంగా మారుతుంది.
-సాబేరాబేగం అంగన్వాడీ టీచర్, షాద్నగర్ రూరల్
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నది. అంగన్వాడీ టీచర్ల కష్టాలు తెలుసుకుని ఆయన
పరిష్కరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ అందిస్తున్నారు. గర్భిణు లు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని స్వాగతిస్తున్నా.
-భారతి, అంగన్వాడీ టీచర్, గంగారం, వికారాబాద్ మండలం
దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు వస్తే మార్పు కచ్చితంగా ఉంటుంది. ఆయన ఒక ప్రజాకర్షణ కలిగిన నేత. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశాభివృద్ధి ఆయనతోనే సాధ్యమవుతుంది. సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశం మొత్తం విస్తరిస్తారు. తద్వారా దేశం కూడా అభివృద్ధిపథంలో ముందుకు సాగుతుంది.
-మరియమ్మ, అంగన్వాడీ రెండో కేంద్రం టీచర్, తొరుమామిడి గ్రామం, బంట్వారం మండలం
అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గౌరవప్రదమైన వేతనాలను అందిస్తున్నది. గతంలో వేతనాలు చాలా తక్కువగా ఉండేవి. కేసీఆర్ సీఎం అయ్యాక ప్రస్తుతం రూ. 13 వేలకుపైగా వేతనం వస్తుంది. సీఎం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి పార్టీ పెట్టి, ప్రధాని అయితే అంగన్వాడీలతోపాటు బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎం తో మేలు జరుగుతుంది.
-వెంకటమ్మ, అంగన్వాడీ టీచర్, ఇబ్రహీంపట్నం
సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎనిమిదేండ్ల క్రితం మా జీతాలు చాలా తక్కువ. మా బాధలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ అడగకుండానే వేతనాలను పెంచారు. ఈ రోజు కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నామంటే అది ఆయన చలువే. ఇలా ప్రజల బాధలు తెలిసిన గొప్ప నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఇతర రాష్ర్టాల ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. -శివరాణి, అంగన్వాడీ టీచర్ ఇబ్రహీంపట్నం