దేశవ్యాప్తంగా 72 నగరాలతో పోటీ
మార్కుల జాబితాలో ముందున్న సిటీ
అధికారుల ప్రత్యేక దృష్టి
గెలుపుపై కార్పొరేషన్ ధీమా
వరంగల్, మార్చి 15: శాస్త్రీయంగా సెప్టిక్ ట్యాంక్ల క్లీనిం గ్, మనుషులు లేకుండా యంత్రాలను వినియోగిస్తూ మ్యాన్ హోల్లను శుభ్రం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ప్రక టించిన సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్-2021 పోటీకి గ్రేట ర్ వరంగల్ కార్పొరేషన్ ఎంపికైంది. దేశవ్యాప్తంగా మూడు కేటగిరీల్లో నిర్వహిస్తున్న పోటీల్లో 10 లక్షల లోపు జనాభా క లిగిన నగరాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి వరంగల్తోపాటు నిజామాబాద్ ఎంపికైంది. మూడు విభాగాల్లో 243 నగరా లు పోటీ పడుతుండగా, 3 లక్షల నుంచి 10 లక్షల లోపు జనా భా కలిగిన కేటగిరీలో వరంగల్ 72 నగరాలతో పోటీ పడు తోంది. ఇప్పటికే వివిధ విభాగాల్లో గ్రేటర్ కార్పొరేషన్ ముం దుంది. మొత్తం 1000 మార్కులు ఉండే పోటీలో సెప్టిక్ ట్యాంక్ల క్లీనింగ్, వ్యక్తిగత పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, వ్యర్థాల రీ యూజ్తోపాటు మ్యాన్ హోల్స్, సెప్టిక్ ట్యాంక్లను యంత్రాలను వినియోగించి శాస్త్రీయంగా శుభ్రపరచడంపై మార్కులు కేటాయించనున్నారు. ప్రతి కేటగి రీలో ప్రథమ,ద్వీతీయ, తృతీయ విభజించి ప్రైజ్ మనీ ప్రక టించనున్నారు. అయితే గ్రేటర్ వరంగల్లో పదేళ్ల ముందే మానవ మల, మూత్ర వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చేసి పక్కాగా సెప్టిక్ ట్యాంక్ల క్లీనింగ్లపై దృష్టిసారిస్తోంది. దీంతోపాటు సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్ పోటీల్లో భాగంగా ప్రతి ఆదివారం నగరంలో ప్రజలను చైతన్య పరిచే కార్యక్ర మాలను నిర్వహిస్తోంది. దీంతోపాటు ఓడీఎఫ్ ప్లస్ప్లస్ సా ధించింది. దీంతో 10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరీ లో వరంగల్ నగరానికి పక్కాగా ప్రైజ్ వస్తుందన్న ఆశాభా వంతో గ్రేటర్ అధికారులు ఉన్నారు.
74 నగరాల మధ్య పోటీ
సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్-2021 పోటీలో 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా లోపు ఉన్న నగరాల కేటగిరీలో దేశ వ్యాప్తంగా 74 నగరాలు పోటీ పడుతున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి వరంగల్, నిజామాబాద్ ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా పలు నగరాలు ఎంపికయ్యాయి. ఆం ధ్రప్రదేశ్ నుంచి 6, తమిళనాడు 5, కేరళ 5, కర్ణాటక 9, మ హారాష్ట్ర 12, గుజరాత్ 3, మధ్యప్రదేశ్ 2, ఒడిశా 2, పశ్చి మ బెంగాల్ 2, అస్సాం 1, త్రిపుర 1, బీహార్ 1, ఉత్తర ప్ర దేశ్ 8, రాజస్థాన్ 4, హర్యానా 3, ఉత్తరాఖండ్ 1, పంజాబ్ 3 నగరాలు ఈ కేటగిరీలో పోటీ పడుతున్నాయి. ఇందులో గె లుపొందిన నగరాలకు కేంద్రం భారీ నజరానా ప్రకటించనుం ది. మొదటి బహుమతిగా రూ. 6 కోట్లు, రెండో బహుమ తిగా రూ. 5 కోట్లు, మూడో బహు మతిగా రూ. 4 కోట్లు నగ దును అందజేయనుంది. ఫలితాలను వచ్చే ఆగస్టులో ప్రధాన మంత్రి ప్రకటించనున్నారు.
ప్రజాచైతన్యంతో ముందుకు..
సఫాయిమిత్ర సురక్ష చాలెంజ్ పోటీలో భాగంగా గ్రేటర్ అధికారులు ప్రజలను చైతన్య పరుచడంలో ముందున్నారు. ప్రతి ఆదివారం గ్రేటర్ ప్రజారోగ్య విభాగం అధికారులు కా లనీలను ఎంపిక చేసుకోని సెప్టిక్ ట్యాంక్ల క్లీనింగ్, వ్యక్తిగత పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతోపాటు కళాజాతాలు నిర్వహిస్తున్నారు. ము ఖ్యంగా వ్యర్థాల ద్వారా ఎరువులను తయారు చేసే ప్రక్రి య ను ప్రజల్లోకి తీసుకపోయేందుకు శ్రమిస్తున్నారు. ఇప్పటికే కూరగాయల మార్కెట్లు, షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్స్, ఫంక్షన్ హల్స్లో వర్మి కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేసే లా చర్యలు తీసుకుంటున్నారు. సఫాయిమిత్ర సురక్ష చా లెం జ్లో ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలపై ప్రత్యేకంగా 200 మార్కులు కేటాయించనున్న నేపథ్యంలో గ్రేటర్ అధికా రులు వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
శాస్త్రీయంగా సెప్టిక్ ట్యాంక్ల క్లీనింగ్
గ్రేటర్ కార్పొరేషన్ శాస్త్రీయంగా మనుషులను వినియో గించకుండా యంత్రాలతో సెప్టిక్ ట్యాంక్లను శుభ్రం చే స్తోంది. మ్యాన్హోల్స్ శుభ్రంలో పూర్తిగా యంత్రాలను వినియోగిస్తున్నారు. మ్యాన్హోల్స్, కల్వర్టుల కింద కాల్వ లు శుభ్రం చేసేందుకు అధికారులు హైడ్రో జట్టింగ్ మిషన్ ను కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది నగరంలో అద్దెపై ఈ యంత్రాన్ని తీసుకువచ్చారు. సెప్టిక్ ట్యాంక్ల క్లీనింగ్ కోసం ప్రత్యేకంగా 20 వాహనాలకు గ్రేటర్ అధికారులు లెసెన్స్లు ఇచ్చారు. నగరంలోని 1.80 లక్షల సెప్టిక్ ట్యాం క్లను శాస్త్రీయంగా శుద్ధిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు లైసెన్స్ పొందిన వాహనాలు 14 సెప్టిక్ ట్యాంక్లను శుభ్రపరిచి మానవ మల వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రానికి తరలించాయి. మొత్తంగా 42 లక్షల లీట ర్ల మల వ్యర్థాలను శుద్ధి చేసి 30 టన్నుల ఎరువును త యారు చేశారు. దీన్ని రైతులకు విక్రయిస్తున్నారు. సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్ పోటీలో ఎంపికైన వరంగల్ ప్రైజ్ మనీ పొందడానికి ఈ ఆంశాలు అనుకూలంగా ఉన్నాయి.