కొవిడ్ బాధితులకు స్థానిక సీహెచ్సీలోనే వైద్యం
ఉద్యోగులు స్థానికంగానే నివాసం ఉండాలి
దవాఖానలు శుభ్రంగా ఉంచాలి
గార్ల, మే 1: ప్రభుత్వాధికారులు విధుల నిర్వహణలో నిర్ల క్ష్యం చేయొద్దని, స్థానికంగా నివాసాలు ఉండాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభు త్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి ఆయన సందర్శించారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని టీఎస్ ఐడీసీ డీఈఈ శ్రీనివాస్ను కలెక్టర్ ఆదేశించారు. సీహెచ్సీలో కొవిడ్ బ్లాక్ త్వర గా ఏర్పాటు చేయాల్సినవసరం ఉందన్నారు. మరో రెండు రోజుల్లో మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు వైద్యాధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీహెచ్సీలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. దంతాలపల్లిలో ఇటీవల ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రజలు పెద్దఎత్తున పండుగలతో పాటు ఇతర వేడుకలు జరుపుకున్నారని, ఫలితంగా పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తుజేశారు.
కొవిడ్ టెస్టులకు వైధ్యాధికారులు అంగన్వాడీ టీచర్ల సహాయం విధిగా తీసుకోవాలని సూచించారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి ఆలస్యం చే యకుండా పరీక్షలు చేయాలన్నారు. అత్యవసర వైద్య సేవలు అవసరమైన కొవిడ్ బాధితులకు మాత్రమే 30 పడకల సీహెచ్సీలో వైద్య సేవలు అందించాలన్నారు. కరోనాతో కాస్త ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలోకి తరలించాలన్నారు. కలెక్టర్ వెంట ఎంపీపీ శివాజీ, జడ్పీటీసీ జే ఝాన్సి, పీఏసీఎస్ చైర్మన్ వీ దుర్గాప్రసాద్, సర్పంచ్లు ఏ బన్సీలాల్, డీ సక్రు, ఎంపీటీసీలు ఎస్ రమేశ్, పీ సుజాత, ఏడీఎంహెచ్వో అంబాల అంబరీష, జిల్లా కొవిడ్ విభాగం నోడల్ అధికారి రాజేశ్, మండల ప్రత్యేక అధికారి నర్సింహామూర్తి, తహసీల్దార్ కే స్వాతిబిందు, ఎంపీడీవో జీ రవీందర్రావు, వైద్యులు ప్రణవి, రాణాప్రతాప్, ఎమ్మారై సూరయ్య, ఎంపీవో కిశోర్, కార్యదర్శి జీ లక్ష్మణ్ ఉన్నారు.