యాదాద్రి, అక్టోబర్13 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం, ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన చేశారు. ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి, అనంతరం తులసీ ప్రతాలతో అర్చన జరిపించారు. దర్శనమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన చేశారు. బాలాలయంలోని మహా మండపంలో సుదర్శన నారసింహహోమం, విశ్వక్సేనారాధన, నిత్య తిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. రాత్రి ఆరగింపుతోపాటు పవళింపు సేవను నిర్వహించారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితారాజేందర్ సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు వారికి వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 36,908
రూ.100 దర్శనం టిక్కెట్ 18,900
నిత్యకైంకర్యాలు 400
వేద ఆశీర్వచనం 1,548
క్యారీబ్యాగుల విక్రయం 1,100
వ్రత పూజలు 5,500
కల్యాణకట్ట టిక్కెట్లు 6,200
ప్రసాద విక్రయం 1,76,010
వాహన పూజలు 8,900
టోల్గేట్ 620
అన్నదాన విరాళం 19,550
సువర్ణ పుష్పార్చన 44,280
యాదరుషి నిలయం 16,800
పాతగుట్ట నుంచి 7,385