హాలియా, మార్చి15: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని పేరూరు స్వయంభూ సోమేశ్వర ఆలయకమిటీ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరుగుతున్న మహిళల రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ కబడ్డీ పోటీలు సోమవారం ముగిశాయి. ఈ పోటీల్లో నల్లగొండ-2 జట్టు ప్రథమ, ఖమ్మం జిల్లా జట్టు ద్వితీయ, నల్లగొండ జట్టుకు తృతీయ , సూర్యాపేట జట్టుకు చతుర్ధ, వరంగల్ జట్టు ఐదు, మహబూబాబాద్ జట్టు ఆరో బహుమతి దక్కించుకున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థ్ధాయి కబడ్డీ పోటీల్లో కొల్లూరు జట్టు ప్రథమ, అనుముల జట్టు ద్వితీయ, తిరుమలగిరి జట్టు తృతీయ, కొట్టాల జట్టు నాలుగో చిలుకాపురం జట్టు ఐదు, మిర్యాలగూడ జట్టు ఆరో బహుమతి గెలుచుకున్నాయి. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
పేరూరులో నిర్వహించిన రాష్ట్ర స్థ్ధాయి ఎడ్ల పందేలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ పోటీలకు 6 జతల ఎడ్లు రాగా వీటి మధ్య పందెం నువ్వా నేనా అన్న చందంగా సాగింది. పోటీలను టీఆర్ఎస్ జిల్లా నాయకుడు యడవల్లి మహేందర్రెడ్డి , కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఎక్కలూరి శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. ఒంగోలుకు చెందిన ఎద్దుల జతలు ప్రథమ, ద్వితీయ బహుమతి సాధించాయి. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కట్టెబోయిన గురువయ్య యాదవ్, సర్పంచ్ యడవల్లి సుధారాణీనాగరాజు, ఆలయ కమిటీ చైర్మన్ రాయనబోయిన రామలింగయ్య, డాక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.