మేడ్చల్ జోన్ బృందం, మార్చి 4 : టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మేడ్చల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టభద్రుల ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి మొదటి ప్రాధాన్యత ఓటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి వేయాలని అభ్యర్థిస్తున్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలో నాయకులు సందీప్గౌడ్, కౌన్సిలర్ కౌడే మహేశ్ పట్టభద్రులను కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని కోరారు.
అభివృద్ధికే పట్టం గట్టాలని తూంకుంట కౌన్సిలర్ పి.నర్సింగ్గౌడ్, శామీర్పేట ఎంపీపీ ఎల్లూబాయి, ఎంపీటీసీ ఇందిరా, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల జగదీశ్గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు అల్లం శ్రీనివాస్ అన్నారు. కో ఆప్షన్ సభ్యుడు మిర్జా షఫీఉల్లాబేగ్, టీఆర్ఎస్ యువజన ప్రధాన కార్యదర్శి డి.రామ్మోహన్, శ్రీనివాస్రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
విద్యావేత్త అయిన వాణీదేవిని మెజార్టీతో గెలిపించుకుంటామని జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర ఎంపీపీ ఇందిరా అన్నారు. మండల పరిధిలోని కీసర, చీర్యాల్, తిమ్మాయిపల్లి, గోధుమకుంట గ్రామాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్పంచ్లు మాధురి , ఆకిటి మహేందర్రెడ్డి, తుంగ ధర్మేందర్, నాయకులు వెంకటేశ్ పాల్గొన్నారు.
కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి ఆంజనేయులు గౌడ్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి స్థానిక యువత, నాయకులకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దిశానిర్దేశం చేస్తున్నారు. 136 మంది ఇన్చార్జిలు గురువారం క్షేత్రస్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సామల మనోహర్రెడ్డి, శ్రీధర్గౌడ్, విప్లమ్రెడ్డి, కీర్తన్రెడ్డి, ఉప్పరి విజయ్ పాల్గొన్నారు.
రెండు మున్సిపాలిటీల పరిధిలో అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, మున్సిపాలిటీల టీఆర్ఎస్ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్, తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శులు హరిగౌడ్, ఎం. శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
మండల పరిధిలోని గౌడవెల్లిలో ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రణదీప్రెడ్డి, మాజీ సర్పంచ్ జగన్రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి లహరిరెడ్డి, వార్డు సభ్యులు , టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సంతోష్భాను పాల్గొన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మద్దుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మల్లికార్జున్ ముదిరాజ్, అమరం జైపాల్రెడ్డి, బేరి బాలరాజు, యాదగిరి పాల్గొన్నారు.
కార్పొరేషన్ పరిధిలో… 16వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్య సతీశ్గౌడ్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి సురభి వాణీదేవికి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను అభ్యర్థించారు. కల్యాణి, చందన, సత్యనారాయణ, వెంకటస్వామి, ఖాలీద్భాయ్, రమేశ్ పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి కొర్రెములలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మహేంద్రాచారి పాల్గొన్నారు.
కార్పొరేషన్లో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, జిల్లా నాయకుడు డాక్టర్ రాజశేఖర్, కార్పొరేషన్ పార్టీ అధ్యక్షుడు బి.కొండల్ ముదిరాజ్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. కార్పొరేటర్లు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, గొడుగు వేణు, మేరు సతీష్కుమార్, అల్లూరి సంగీత రాజశేఖర్, మెట్టు ఆశ కుమారి, గండి రాంచందర్, పి.బాబు, బింగి లావణ్య సతీశ్గౌడ్, జిట్ట శ్రీవాణి శ్రీనివాస్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు మేకల భార్గవ రామ్, ప్రధాన కార్యదర్శి మెట్టు ప్రణీత్కుమార్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు.
మున్సిపాలిటీ పరిధి…3వ వార్డు చందుపట్లగూడలో టీఆర్ఎస్ నాయకుడు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. మున్సిపాలిటీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపాల సుధాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్ ముదిరాజ్,నాయకులు బొక్క జంగారెడ్డి, వార్డు అధ్యక్షుడు హరికిషన్ రెడ్డి,గడీల రాంచంద్రారెడ్డి, కిషన్ ముదిరాజ్,కట్ట నర్సింహా రెడ్డి, వినోద్రెడ్డి పట్టభద్రులను కలిసి వాణీదేవిని గెలిపించాలని కోరారు.