ఉద్యోగాలకు జోనల్ వ్యవస్థ ఆమోదంపై టీఆర్ఎస్వీ హర్షం
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
నల్లగొండ రూరల్, ఏప్రిల్22 : జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలుపడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. ఇక 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ యువతకు దక్కడంతోపాటు పదోన్నతులు త్వరగా రానున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించినందుకు గురువారం నల్లగొండ, మిర్యాలగూడలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
95 శాతం ఉద్యోగాలు తెలంగాణ యువతకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన జోనల్ వ్యవస్థను రాష్ట్రపతి ఆమోదించడం హర్షణీయమని టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కొమ్మనబోయిన సైదులు, రాష్ట్ర నాయకుడు సుంకరబోయిన సత్యనారాయణ అన్నారు. గురువారం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రస్తుతం భర్తీ చేయనున్న 50 వేల ఉద్యోగాలు కూడాకొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉంటాయని పేర్కొన్నారు. సంఘం నాయకులు వంగాల సాయి, పోతేపాక నవీన్, విజయ్ బాలు, గణేశ్, కిరణ్, సైదులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ టౌన్ : టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు ఆధ్వర్యంలో గురువారం బస్టాండ్ ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి షోయబ్, దినేశ్, మహేశ్, శ్రీనాథ్, శివ పాల్గొన్నారు.