చేతుల శానిటైజ్ తప్పనిసరి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి
హన్మకొండ, ఏప్రిల్ 29 : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కొవిడ్-19 నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని రా ష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ఎన్నికలు జరుగనున్న జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్, కౌం టింగ్ రోజుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో శానిటైజేషన్ చేయాలన్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందు, బయటకు వచ్చిన తర్వాత ఓటర్లు చేతులను శానిటైజ్ చేసుకునేలా చూసేందుకు ఓ ఇన్చార్జిని నియమించి శానిటైజర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఓ టర్లు భౌతికదూరం పాటించేలా పోలింగ్ కేంద్రాల బయట వలయాలను మార్కింగ్ చేయాలన్నారు. పర్యవేక్షణకు కానిస్టేబుల్ ను నియమించాలన్నారు. పోలింగ్ సిబ్బం ది, ఏజెంట్లకు భౌతికదూరం పాటిస్తూ సీ టింగ్ ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది విధిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలన్నారు. అనారోగ్యంగా ఉంటే పోలింగ్ విధులు కేటాయించొద్దన్నారు.
అన్ని ఏర్పాట్లు చేశాం : కలెక్టర్
ఓటర్లు సులువుగా తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. 1221 బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల పంపిణీ, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో శానిటైజ్ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందికి 14వేల ఎన్ – 95 మాస్కులు, 10వేల త్రీ లేయర్ మాస్కులు, 14వేల నైట్రోజన్ గ్లౌవ్స్, 14వేల ఫేస్షీల్డ్స్, 1400 లీటర్ల శానిటైజర్, ఒక్కొక్కరికి 100ఎంఎల్ చొప్పున అందిస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో మెడికల్ టీం, కొన్ని పోలింగ్ లొకేషన్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 529 కేంద్రాల్లో సీసీటీవీ, 46 కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్కు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 323 పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకుల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నగర కమిషనర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.