-150 వార్డుల్లో విస్తృత శానిటేషన్ కార్యక్రమాలు
-త్వరలో తేదీలను ప్రకటిస్తాం
-మేయర్ బొంతు రామ్మోహన్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా త్వరలో ప్రారంభించను న్న వార్డులవారీగా నిర్వహించనున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతంచేయాలని కాలనీ సంక్షేమ సంఘా లు, బస్తీ కమిటీల ప్రతినిధులకు నగర మేయ ర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. వార్డులవారీగా చేపట్టనున్న ప్రత్యేక పారిశు ధ్య కార్యక్రమ నిర్వహణ కోసం సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాలనీ, సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, జోన ల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని 150 వార్డుల్లో ఒక్కో వార్డుకు రెండు లేదా మూడు రోజులపాటు విస్తృత శానిటేషన్ కార్యక్రమాలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాలు, కాలనీ సంక్షేమ సం ఘాలు, మహిళాసంఘాలను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన పనికిరాని వస్తువుల సేకరణ కార్యక్రమం పూర్తిగా విజయవంతమైందని, దాదాపు 250 మెట్రిక్ టన్నులకుపైగా వ్యర్థాలను సేకరించాలని మేయర్ వెల్లడించా రు. ఇదే మాదిరిగా భవన నిర్మాణ వ్యర్థాల చైతన్య కార్యక్రమాలను ప్రారంభించనున్నామని తెలిపారు. వార్డులవారీ శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టే తేదీలను త్వరలోనే ప్రకటించున్నామని పేర్కొన్నారు. భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపునకుగానూ ప్రతి సర్కిల్లో ఒక డిపాజిట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.