హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి వారి దర్శనభాగ్యం కలుగనుంది. ప్రభుత్వం కరోనా లాక్డౌన్ను ఎత్తివేయడంతో భక్తులకు స్వామివారి దర్శనానికి ఆలయ అధికారులు అనుమతించారు. యాదాద్రీశుని ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు కూడా భక్తులకు అనుమతించారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి భక్తులకు నారసింహుని దర్శనాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో లాక్డౌన్ను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఎత్తివేసింది. కరోనా తీవ్రత తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. దీంతో ప్రజాజీవితం, వ్యాపార కార్యకలాపాలు సాధారణంగా సాగనున్నాయి.