హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా ఉధృతి కారణంగా ఈ నెల 18 నుంచి 22 వరకు రాజరాజేశ్వరుని దర్శనాలను అధికారులు రద్దు చేశారు. నేటి నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతినిస్తున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే దర్శనాలు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కోడెమొక్కు, ఇతర ఆర్జిత సేవలన్నింటినీ మళ్లీ ప్రకటించే వరకు రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. భక్తులు విధిగా మాస్కులు ధరించి, నిర్ణీత దూరం పాటించాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..