దేవరంపల్లి, జీర్లపల్లి, ఏడాకులపల్లి గ్రామాల్లో రైతు వేదికలు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
ఝరాసంగం, ఏప్రిల్ 19: రైతు సంఘటితానికే ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ అన్నారు. సోమవారం మండలంలోని దేవరంపల్లి, జీర్లపల్లి, ఏడాకులపల్లి గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతు వేదికలు చర్చా వేదికలు కావాలన్నారు. రైతులు లాభదాయక పంటలు సాగు చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. ప్రభుత్వం రైతులను సంఘటితం చేసే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నదన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాత కేంద్రాలు కావాలని వారు గుర్తుచేశారు.
అంబేద్కర్ బాటలో ప్రతిఒక్కరూ నడవాలి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాటలో ప్రతిఒక్కరూ నడుచుకోవాలని ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ అన్నారు. సోమవారం మండలంలోని గంగాపూర్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ.. అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి అన్నారు. అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి బౌద్ధ గురువులతో ప్రత్యేక పూజా కార్యాక్రమాలు చేశారు. కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మాల్కపూర్ శివకుమార్, సీడీసీ చైర్మన్, ఉమాకాంత్పాటిల్, జహీరాబాద్ ఏడీఏ భిక్షపతి, మండల వ్యవసాయశాఖ అధికారి వెంకటేశం, సర్పంచ్ శశికళశ్యామ్, మండల రైతు సమన్వయ కన్వీనర్ సుభాశ్రావు, ఎంపీటీసీలు విజేందర్రెడ్డి, శంకర్పాటిల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, జడ్పీటీసీ వినీలనరేశ్, సర్పంచ్ శివరాజ్పాటిల్, ఉపసర్పంచ్ ఉమేశ్ పాటిల్ న్యాయవాది అంజయ్య, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బాలకృష్ణ, బాబు, లక్ష్మయ్య, రాజు, మాజీ సర్పంచ్ పెంటయ్య పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…