హైదరాబాద్ : శ్రీ ప్లవ నామ సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, ధన ధాన్యాలు, శుభ ఫలితాలు కలుగుతాయని డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్ర్తి పేర్కొన్నారు. సంతోష్ కుమార్ శాస్ర్తిచే ఉగాది పంచాంగ పఠనం నిర్వహించారు.
చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణమే ఈ ప్లవ నామ సంవత్సరం అని తెలిపారు. సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. ప్రభుత్వ రంగాలు, బ్యాంకింగ్ రంగం పురోగతిలో ఉంటాయన్న ఆయన.. విద్యాసంస్థలకు వృద్ధి ఉంటుందని స్పష్టం చేశారు. పోలీసు శాఖ పనితీరు సమర్థవంతంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం, దేవాలయాల ఆదాయం వృద్ధఙలో ఉంటుందని చెప్పారు. ఈ ఏడాది కరోనా బారి నుంచి బయటపడుతామన్నారు. ప్రజలకు భయం, అతివృష్టి తప్పకపోవచ్చు అని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబంధాలు బాగుంటాయని తెలిపారు.
రైతులకు శుభప్రదంగా ఉంటుంది. ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ వర్షాలు భాగానే కురుస్తాయి. వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు రైతులు పంటలు వేయాలి అని సూచించారు. రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ది వుంటుంది. భూముల కుంభకోణాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రజలు భూముల క్రయవిక్రయాల్లో జాగ్రత్త ఉండాలి అని సంతోష్ కుమార్ శాస్ర్తి సూచించారు.