హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు ఈనెల 14 వరకు జరుగుతాయి. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అలంకా దర్శనాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. ఇవాళ మల్లికార్జునస్వామికి భృంగి వాహనసేవ నిర్వహించనున్నారు.
రేపు స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ, అమ్మవారికి మహాదుర్గ అలంకారం చేయనున్నారు. ఉత్సవాల్లో భాగంగా 12న నంది వాహనసేవ, అమ్మవారికి మహా సరస్వతి అలంకారం చేస్తారు. సోమవారం సాయంత్రం ప్రభోత్సవం, వీరాచారి విన్యాసాలు ఉంటాయి. ఈనెల 13న ఉగాది పంచాంగ శ్రవణం, సాయంత్రం స్వామి అమ్మవార్ల రథోత్సవం, అమ్మవారికి రమావాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారం చేస్తారు.
14న స్వామిఅమ్మవార్లకు అశ్వవాహన సేవ, భ్రమరాంబదేవి అమ్మవారికి నిజాలంకరణ చేస్తారు. ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కరోనా నేపథ్యంలో భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..