నల్లగొండ : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. పట్టణంలోని 11వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి మురాల శెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, 15, 16 వ వార్డుల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మహ్మద్ షెహనాజ్ మొయిజ్, చెరుకు వసంత వీరయ్య గెలుపు కోసం పార్టీ శ్రేణులు సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించాయి. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, శాసన మండలి వైస్ చైర్మన్ నేతి విద్యా సాగర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.