తిరుమల: వచ్చే నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడీ) టికెట్ల కోటాను శుక్రవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. రోజుకు 5 వేల చొప్పున విడుదల చేసే ఈ టికెట్లను భక్తులు ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. జూన్ నెల గదుల కోటాను కూడా త్వరలోనే విడుదల చేయనుంది.
కాగా, దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ల నేపథ్యంలో తిరుమల కొండపై భక్తుల తాకిడి భారీగా తగ్గింది. అనునిత్యం 60 వేల మందికి పైగా భక్తులతో కళకళలాడే తిరుమల ఇప్పుడు భక్తులు లేక బోసిపోతోంది. గత మూడు రోజులుగా కేవలం ఐదు వేల లోపు భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమలకు భక్తులు ఎక్కువగా రావడం లేదు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా బాగా తగ్గింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి