నడిగూడెం/మాల్, ఏప్రిల్ 21 : సీఎం కేసీఆర్ కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని నడిగూడెంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత, పేదల పాలిట దేవుడు కేసీఆర్ వైరస్ బారి నుంచి బయటపడి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బాణాల నాగరాజు, ఎలక రాంరెడ్డి, మురళీకృష్ణ, సతీశ్, వెంకటేశ్ పాల్గొన్నారు. చింతపల్లి మండలం మాల్ పరిధిలోని గొల్లపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి ఆధ్వర్యలో పూజలు చేశారు. కార్యక్రమంలో నక్కనమోని పరమేశ్, అనంతుల శ్రీను, రాములు, నాగరాజు, మల్లేశ్, జంగారెడ్డి, విష్ణురెడ్డి, వెంకటయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.
అర్వపల్లి : జిల్లా వ్యాప్తంగా పాస్టర్లు ప్రార్థనలు చేయాలని పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసన్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన పాస్టర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పాస్టర్లు కేలోతు చంద్రశేఖర్, ప్రభుదాస్, సైమన్, దామోదర్పాల్, యాకోబు తదితరులు పాల్గొన్నారు.
హాలియా : కొవిడ్ బారిన పడిన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, నాగార్జున సాగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో నోముల భగత్ అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని కోరుతూ అనుముల మండలం హాలియాకు చెందిన టీఆర్ఎస్ యువజన నాయకుడు పగడోజు సైదాచారి ఆధ్వర్యంలో హాలియాలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. పగడాల అన్వేష్, కుమ్మం మోహిత్రెడ్డి, కర్ణ ప్రణయ్రెడ్డి, సుమంత్రెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు.
తుంగతుర్తి : మండల కేంద్రంలోని రామాలయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బండరామారంలోని ఆంజనేయస్వామి ఆలయంలో గ్రామస్తులు పూజలు చేశారు. కరోనా మహమ్మారి నుంచి సీఎం కేసీఆర్ను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆలయ అర్చకులు కాటూరి రామాచార్యులు, రామాలయ చైర్మన్ ముత్యాల వెంకన్న, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య, గడ్డం ఉప్పలయ్య, జయచందర్రెడ్డి, ఆకారపు రాములు, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
చింతలపాలెం : మండలంలోని దొండపహాడ్లో గల నాగేంద్ర స్వామి ఆలయంలో టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్తమద్ది వెంకట్రెడ్డి, నాయకులు కోటిరెడ్డి, బాబురావు, వెంకటరంగారెడ్డి, సత్యనారాయణరెడ్డి, రంగారెడ్డి, సత్యనారాయణరెడ్డి, రోషిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.