వికారాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలం పర్యాటక కేంద్రంగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనంతగిరి అడవులు చిగురించి పచ్చగా మారాయి. దీంతో మన అనంతగిరి కొండలు ఊటీని తలపిస్తున్నాయి. దీంతో ప్రకృతి అందాలను చూసేందుకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేయడంతో పద్మనాభస్వామి ఆలయంతో పాటు వాటర్ఫాల్స్, వ్యూపాయింట్, నందిఘాట్కు పర్యాటకుల తాకిడి పెరిగింది.