అమరావతి : విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహాండ్స్ దళాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగినట్లు తెలిసింది. గంటపాటు ఎదురు కాల్పులు జరగ్గా చాలామంది మావోయిస్టులు తప్పించుకున్నారని సమాచారం. దీంతో మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. సరిహద్దులో వాహన తనిఖీలనూ ముమ్మరం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.