బీజింగ్: చైనాలో గ్యాస్ పైప్లైన్లో లీకేజీ కారణంగా పేలుడు సంభవించి 25 మంది మరణించారు. హుబే రాష్టం జంగ్వాన్లోని షియాన్ సిటీలో గల రెండంతస్తుల భవనంలో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో బాధితులు తీవ్ర గాయాలపాలయ్యి దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ పైప్లైన్లపై తనిఖీలు చేపట్టాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది.