హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనునున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) పోస్టులకు ఇప్పుడున్న గరిష్ఠ వయోపరిమితిని 34 ఏడ్ల నుంచి 44 సంవత్సరాలకు పెంచాలని హైకోర్టు న్యాయవాదులు సంఘం ప్రతినిధులు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు. సోమవారం అరణ్య భవన్ లో మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. టీస్ఎస్పీఎస్సీ గతంలో నిర్వహించిన వివిధ పోటీ పోటీ పరీక్షలకు వయోపరిమితిని సడలించిందన్నారు.
ఏపీపీల నియమాకానికి కూడా వయో పరిమితిని పెంచాలని మంత్రికి వివరించారు.
సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వారికి హామీనిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, టీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంచార్జీ సీ. కళ్యాణ్ రావు, ఇతర టీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు లలితారెడ్డి, నల్లమోతు రాము, సదానంద, విశ్వేశ్వరరావు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ధనలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు శ్రావ్య, రాజు, రమేష్ బాబు, హరీష్, భాస్కర్ గౌడ్, చంద్రశేఖర్ రావు, అజయ్ కుమార్, శ్రావణ్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
గోదావరిలో మునిగిన పురాతన శివాలయం
బైక్ను ఢీ కొట్టిన డీసీఎం..ఒకరి మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు