రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఘటనాస్థలి నుంచి 9 ఎంఎం పిస్తోల్, కంట్రీ మేడ్ బర్మార్, 3 కేజీల ఐఈడీతో పాటు మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టుపై రూ. 5 లక్షల రివార్డు ఉందని, అతనిపై 15 కేసులు నమోదైనట్లు చెప్పారు.