శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శుక్రవారం మాసశివరాత్రి సందర్బంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైల గ్రామదేవత అంకాలమ్మకు ఉదయం అభిషేకాలు వారపూజలు నిర్వహించినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. మల్లన్నకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చనలు శాస్త్రోక్తంగా జరిపించారు. సాయంత్రం భ్రామరీ అమ్మవారికి వివిధ రకాల ప్రీతికరమైన గులాబీ, గన్నేరు, దేవగన్నేరు, నందివర్దనం, గరుడవర్దనం, మల్లెలు, చామంతులతో పుష్పాలంకరణ చేసిన ఉయలలో స్వామి అమ్మవార్లను వేంచేబు చేసి, అర్చక వేదపండితులు సేవా సంకల్పాన్ని పఠించి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్త్రనామాలతో షోడశోపచార క్రతువులు, ఊయల సేవను ఘనంగా నిర్వహించారు.