భద్రాద్రి: భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనల దృష్ట్యా ఈసారి బేడా మండపంలో వేడుకలను నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీరాముని మహాపట్టాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మహాపట్టాభిషేక కార్యాక్రమం జరగనుంది. దీనికి నిత్యకల్యాణ మండపం వేదికకానుంది. అయితే కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండా వైదిక సిబ్బంది సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇవాళ రాత్రి 7 గంటలకు రజత రథోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈనెల 27 వరకు నిత్యకల్యాణాలు, కరోనా నిబంధనల్లో భాగంగా పూజలు, తీర్థప్రసాదాలు నిలిపివేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..