కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతాబెనర్జీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 5న మమతాబెనర్జి సీఎంగా ప్రమాణం చేస్తారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ పార్థా చటర్జి తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా కలిసి ఏకగ్రీవంగా ఆమెను తమ నాయకురాలిగా ఎన్నుకున్నారని పార్థా చట్టర్జి వెల్లడించారు.
ఇక ప్రొటెం స్పీకర్గా గత అసెంబ్లీలో స్పీకర్గా పనిచేసిన బిమన్ బెనర్జిని ఎన్నుకున్నట్లు పార్థా చట్టర్జి చెప్పారు. ఈ నెల 5న మమతాబెనర్జి ప్రమాణం చేయనుండగా, మే 6 నుంచి శాసనసభ్యులు సభలో ప్రమాణాలు చేస్తారని ఆయన తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కోల్కతాలోని టీఎంసీ హెడ్ క్వార్టర్స్లో సమావేశం అనంతరం ఆయన పార్టీ నిర్ణయాలను వెల్లడించారు.
అంతకుముందు మమతా బెనర్జి రాజ్భన్కు వెళ్లి బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను కలిశారు. ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. అదేవిధంగా తనకు కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరారు. తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినంత సంఖ్యా బలం ఉన్నదని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించండి: ఎన్సీపీ డిమాండ్
మామ సీఎం, ఇంటల్లుడు ఎమ్మెల్యే.. అసెంబ్లీలో అరుదైన సీన్..!
ఎమ్మెల్యేగా ఓడిన మమత సీఎం పదవి చేపడుతారా..?
కాంగ్రెస్ కంచుకోటల్లో మమత పాగా.. కారణం తెలుసా..?
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!