ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. దీనినే ‘శయనఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణించడం వల్ల దీనిని దక్షిణాయనంగా పరిగనిస్తారు. చాలా వైష్ణవ దేవాలయాల్లో ఈ రోజున ‘విష్ణు శయనోత్సవం’ జరుపుతారు.
ఆదిశేషుని వాహనంగా కలిగిన నారాయణుని లక్ష్మీసమేతంగా పూజ చేయడం వలన సకల శ్రేయస్సు కలుగును. ఈ రోజున ఉపవాసాదులు, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం సర్వ శ్రేష్ఠం. ఈ తొలి ఏకాదశి రోజున విష్ణు నామ స్మరణ వల్ల అంత్యమున వైకుంఠప్రాప్తి కూడా కలుగుతుందని పురాణవచనం. శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించి పవిత్రమైన కృష్ణనామాలను కనీసం 108 సార్లు జపించాలి.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే.. రామ రామ రామ హరే హరే ॥