అగర్తలా: దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా కుటుంబాల్లో విషాదాన్ని మిగిలిస్తున్నది. దీంతో చాలా మంచి అనాథలుగా మారిపోతున్నారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా అనాథాశ్రమాల్లో ఉండని పిల్లలకు ప్రతినెల రూ.3500 ఇస్తామని సీఎం బిప్లబ్ దేబ్ ప్రకటించారు. చిన్నారులకు 18 ఏండ్లు నిండేవరకు ఈ ఆర్థిక సాయం కొనసాగుతుందని వెల్లడించారు. కరోనా వల్ల అనాథలైన చిన్నారులకు ఇలాంటి పథకాన్నే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రకటించాయి.
త్రిపురలో నిన్న 595 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 49,885కు చేరాయి. ఇందులో 6919 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 42,468 మంది కోలుకున్నారు. మరో 498 మంది మరణించారు.