న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశంలో మే చివరి వరకూ కొనసాగవచ్చు. కేసుల సంఖ్య రోజుకు 3 లక్షలను కూడా తాకవచ్చు. ఇదీ దేశంలోని టాప్ వైరాలజిస్ట్లలో ఒకరైన డాక్టర్ షాహిద్ జమీల్ చెబుతున్న మాట. ఇండియాలో గత 24 గంటల్లో కేసుల సంఖ్య 1,84,372గా నమోదైన విషయం తెలిసిందే. దీనిపై జమీల్ స్పందిస్తూ.. కేసులు రోజురోజుకూ పెరుగుతున్న రేటు చాలా భయపెడుతోంది. రోజుకు 7 శాతం మేర యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇది చాలా చాలా ఎక్కువ. దురదృష్టవశాత్తూ ఇది ఇలాగే కొనసాగితే.. రోజుకు 3 లక్షల వరకూ కూడా కేసులు పెరగవచ్చు అని జమీల్ అన్నారు.
అమెరికా తర్వాత ఒక్క రోజులో ఈ స్థాయి కేసులు నమోదైన దేశం ఇండియానే. వైరస్ కొత్త మ్యూటెంట్లు ఇన్ఫెక్షన్ల సంఖ్యను చాలా వేగంగా పెంచుతున్నాయని జమీల్ అభిప్రాయపడ్డారు. అయితే దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉన్నట్లు వస్తున్న వార్తలను మాత్రం ఆయన ఖండించారు. ఇప్పటికే సీరమ్, భారత్ బయోటెక్ కలిపి 31 నుంచి 32 కోట్ల వరకు వ్యాక్సిన్ డోసులను తయారు చేశాయని, అందులో ఇప్పటి వరకూ కేవలం 12 కోట్ల వరకూ మాత్రమే ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరో ఆరున్నర కోట్ల డోసులను ఎగుమతి చేసినా.. మరో పది కోట్ల వరకూ వ్యాక్సిన్ డోసులు దేశంలో ఉన్నాయని, వ్యాక్సిన్ కొరత లేదని జమీల్ స్పష్టం చేశారు.
ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన సమయంలో కేసుల సంఖ్య తగ్గిపోయిందని, ఆ సమయంలో అందరూ కొవిడ్ ఇక వెళ్లిపోయినట్లు భావించారని ఆయన అన్నారు. దీంతో చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడం ఎందుకు అని నిర్లక్ష్యం వహించారని, వ్యాక్సిన్ తీసుకోవాల్సిన సమయంలో తీసుకోలేదని జమీల్ చెప్పారు.
ఇవి కూడా చదవండి
అవినీతి ఆరోపణలు.. మాజీ కెప్టెన్పై 8 ఏళ్ల నిషేధం
కుంభమేళా ఒక కరోనా ఆటం బాంబు.. రాంగోపాల్ వర్మ సెటైర్లు
IPL 2021: సూర్యకుమార్ హిందీ టెస్ట్లో బౌల్ట్ పాస్.. వీడియో
కరోనా ఆంక్షలు.. రైల్వే స్టేషన్ ముందు భారీ క్యూలైన్లు
శంకర్తో రణ్వీర్.. అపరిచితుడు హిందీ రీమేక్
స్విగ్గీని నిషేధించాలంటున్న రోహిత్ శర్మ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
వెనక్కి తగ్గిన అమెరికా.. భారత్తో భాగస్వామ్యాన్ని గౌరవిస్తామని ప్రకటన
కుంభమేళాను మర్కజ్తో పోల్చవద్దు..
1,84,372 కేసులు.. 1027 మరణాలు.. కరోనా విలయ తాండవం