‘సర్వపాప క్షయకరం భుక్తిముకి ్తప్రదాయకం జేష్ఠస్య కృష్ణపక్షేతు యోగినీ నామనామతః’. అన్ని పాపాలను తొలగించే మహా పుణ్యదినం ‘యోగిని ఏకాదశి’. దీనిని ‘భోగ మోక్షకరి’గానూ వ్యవహరిస్తారు. మిగతా ఏకాదశులవలెనే ఉపవాసం చేసి భక్తిశ్రద్ధలతో భగవంతుడిని ఆరాధించి, రాత్రి జాగరణ చేయాలి. ఉదయం ద్వాదశి రోజున ఉపవాస దీక్షను విరమించాలి.
ఇంట్లో ఏ ఒక్కరు ఈ ఏకాదశి వ్రతం ఆచరించినా ఆ వంశస్తులందరికీ సమస్త సుఖాలూ అందుతాయని, పరమాత్మ అనుగ్రహంతో విష్ణులోకాన్ని చేరగలరని శాస్ర్తాలు చెప్పాయి. దీనికి ఉదాహరణగానే ‘రుక్మాంగదుడు’ అనే రాజుకథ చెప్తారు.
సర్వపుణ్యాధిక ఫలం హరేస్తుష్టి ప్రదం శుభం ఏకాదశీ సమదినం నభూతం నభవిష్యతి.
‘ఏకాదశి’ తిథి అంటేనే విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రం. అందులో ఆయా ప్రత్యేక ఏకాదశులు విశేష పుణ్యకారకాలుగా శాస్ర్తాలు చెప్పాయి. ఈ దీక్షను మించిన పుణ్యఫలం మరొకటి లేదు. దీనితో సమానమైంది ఇంతకు ముందూ లేదు, ఇక ముందూ రాదు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశి వ్రతాలలో అత్యంత ప్రాధాన్యమైన వాటిలో ఒకటే ఈ ‘యోగిని ఏకాదశి’.
జేష్ఠమాసం, కృష్ణపక్షంలోని ‘యోగిని ఏకాదశి’ గొప్పతనాన్ని తెలిపే వృత్తాంతం ‘బ్రహ్మ వైవర్త పురాణం’లో ఉంది. అలకాపురిని పాలించే కుబేరుడు మహా శివభక్తుడు. అతనికి శివపూజకు పుష్పాలు తెచ్చే బాధ్యతకల వ్యక్తి (హేమమాలి) ఒకరోజు వాటిని తేలేదు. విచారించగా, అతను తన భార్య విశాలాక్షితో గడపుతూ తన ఇంటివద్దే ఉండి, ‘విషయాన్ని విస్మరించినట్లు’ గుర్తించాడు. కోపోద్రిక్తుడైన కుబేరుడు భటులను పిలిచి, ‘అతనిని పట్టి తెమ్మని’ ఆజ్ఞాపిస్తాడు. ఉన్నఫలాన ఇంట్లోంచి భటులు అతనిని ఈడ్చుకుని కుబేరుని వద్దకు తెస్తారు. కుబేరుడు, ‘కుష్టురోగివి కమ్మంటూ’ హేమమాలిని శపించాడు. అది నిజమైంది.
హేమమాలిని కుష్టువ్యాధితో బాధపడుతూ ఒకనాడు హేమాద్రి పర్వతానికి వెళ్లాడు. అక్కడ మార్కండేయ మహర్షి విషయం తెలుసుకొని, ‘యోగిని ఏకాదశి వ్రత అనుష్ఠానం’ చేయమని ఆదేశించాడు. ‘యోగిని ఏకాదశి వ్రత మహిమ’నూ తెలిపాడు. మహర్షి అనుగ్రహంతో వ్రతాన్ని ఆచరించాక, తక్షణమే అతని కుష్టురూపం తొలగుతుంది. అప్పటినుండి అతను ప్రతి ఏడాది ‘యోగిని ఏకాదశి వ్రతం’ చేస్తూ పరమ విష్ణుభక్తుడుగా మారాడు. ప్రతి నెలా శుక్ల-కృష్ణ పక్షాలలో వచ్చే ఏకాదశుల ఉపవాస దీక్షను అకుంఠిత భగవన్నామ సంకీర్తనతో చేయమని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఫలితంగా జన్మసార్థకం అవడమేకాక మహా పుణ్యం లభిస్తుంది. ధనధాన్యాలు, పరిపూర్ణమైన ఆరోగ్యమే కాదు, చివరగా జ్ఞానసాధన ద్వారా మోక్షాన్ని సైతం పొందుతారు. మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు, ‘సర్వపాపాలను తొలగించి, ఇహపర సుఖాలను ప్రసాదించే ఏకాదశి వ్రత అనుష్ఠానాన్ని’ బోధించాడు. ‘బ్రహ్మాండ పురాణం’లోనూ ఈ వ్రతం గొప్పతనం ఉంది.
ఇంట్లో ఏ ఒక్కరు ఈ ఏకాదశి వ్రతం ఆచరించినా ఆ వంశస్తులందరికీ సమస్త సుఖాలూ అందుతాయని, పరమాత్మ అనుగ్రహంతో విష్ణులోకాన్ని చేరగలరని శాస్ర్తాలు చెప్పాయి. దీనికి ఉదాహరణగానే ‘రుక్మాంగదుడు’ అనే రాజుకథ చెప్తారు. ఆయన తాను ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ప్రజల చేతకూడా ఆచరింపజేయడంతో అందరి పాపాలూ నశించి, విష్ణు సాన్నిధ్యాన్ని చేరతారు. దాంతో యమలోకం ఖాళీ అయిందట.
శాస్ర్తుల
వేంకటేశ్వరశర్మ
98499 09165