ఒక వ్యక్తి మానసిక ఎదుగుదల సుమారుగా స్థిరపడేటప్పటికి, అతని సాధారణ వైఖరి కూడా స్థిరపడుతుంది. అంటే ఒక వ్యక్తి ఒక సందర్భంలో ఎలా ప్రతిస్పందిస్తాడన్నది మనం ముందే కొంత ఊహించవచ్చు. దానినే ఆ వ్యక్తి స్వభావంగా పరిగణిస్తాం. సహజ ప్రవర్తన, వైఖరి పుట్టుకతో వస్తుంది. అంటే జన్యుపరంగా సంక్రమిస్తుంది. అయితే, సాధన ద్వారా మనిషి తన వ్యక్తిత్వాన్ని కోరుకున్న విధంగా మార్చుకోగలుగుతాడు. ఈ ప్రయత్నంలో గురువు మార్గదర్శనం ఎంతైనా అవసరం.
ఒక వ్యక్తి వైఖరిని తీర్చిదిద్దడంలో అతని వివేచనా స్థాయి, అనుభూతి గాఢత, ఆచరించే సంప్రదాయం కీలక ప్రభావాన్ని చూపుతాయి. వివేచనను మూడు స్థాయిలుగా విభజించవచ్చు. ఒకటి కార్యకారణ సంబంధంవైపు దృష్టి పోకుండా, సహజాతాల గతిగా జీవించడం. ఇది సుమారుగా జంతుస్థాయి జీవనం. అన్నమయ, ప్రాణమయ కోశస్థాయి జీవనం. రెండు, మనసును నియంత్రిస్తూ, తద్వారా కర్మలను నియంత్రించుకుంటూ నైతిక కేంద్రం నుంచి జీవించడం. ఇది మనోమయ కోశస్థాయి జీవనం. మూడు, చైతన్యం వ్యాపకతను గ్రహించి, భేద దృష్టి దాటిన పారమాత్మిక భావనతో జీవించడం. ఇది విజ్ఞానమయ, ఆనందమయ కోశస్థాయి జీవనం. అయితే సాధారణంగా వివేచన విజ్ఞానశాస్త్రంలో జరిగినట్టు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా జరగదు. సంప్రదాయబద్ధమై సాగుతుంది. ఈ ‘బద్ధత’ ఫలితంగానే అనేక విషయాలలో ఎక్కడా పొసగని అభిప్రాయ భేదాలు చోటుచేసుకుంటాయి. రాజకీయరంగం లో, ఆర్థికవిధానాల్లో, అన్నిటినీ మించి మత విషయంలో ఈ భేదాలను విరివిగా చూస్తాము.
పరమ సత్యమనేది దానిని విశ్వసించేవారి సంఖ్యను బట్టి నిర్ణయమవదు. అలా నిర్ణయమయ్యేది వారికి అనుకూలమైన సాపేక్ష సత్యం. దీనిని ఎంతగా పట్టుకుం టే వైఖరులు అంతగా సంకుచితం అవుతాయి. అలాగే అందరికీ వర్తించే సత్యా న్ని ఎంతగా పట్టుకుంటే.. వైఖరులు అంత విశాలమైనవిగా మారుతాయి. వికా సం, విశాలత అనేవి జ్ఞానం, ధర్మం, దయ, ప్రేమతో పెరుగుతాయి. అలాంటి విశాల విశ్వహిత దర్శనమే అద్వైత వైదిక దర్శనం. ‘బ్రహ్మ సత్యం’ అన్న వైఖరి మానవజాతిని మతాతీతంగా సమన్వయపరచి, సంక్షేమంవైపు నడిపేది. దేశకా లాలకు అతీతమైన అన్ని అనుభవాలకూ ఆధార మైన చైతన్యమే అసలైన పారమాత్మిక సత్యం. జీవుడు, జగత్తు, ఈశ్వరు డు పారమాత్మిక సత్యమైన సదాశివ చైతన్యశక్తి ఆభాస (దృశ్యమాత్ర సత్యం) మాత్రమే. వాటిని పట్టుకొని కొట్లాడటం, వాటిలో కొట్టుకుపోవడం కేవలం అజ్ఞానం. ఆ పారమాత్మిక శివచైతన్యశక్తిని పట్టుకొని, విహిత ధర్మ నిర్వహణతో జీవించడమే విద్య. అదే ప్రజ్ఞానమని అద్వైత బోధ.
నిరపేక్ష సత్యం ఒక్కటే. కానీ, గుణమయమైన సాపేక్ష సత్యాలకు లెక్కలేదు. వాటిని పట్టుకొని నడిచేవారు అత్యధిక పరిణతితో ‘ఇతరులను’ ఆదరించినా, వారిని ఆత్మీకరించుకోలేరు. అందుకే అన్ని మతాలూ మానవులందరూ సమాన మే అని చెప్పినా.. ఆ సమానత్వం వారి మతాలను అనుసరించినంత మేరకే. ఏ మతస్థులైనా వారు నమ్మిన నామరూపాలను దాటి, అందరి దైవం సారభూతం గా ఒక్కడే అనీ, మానవత్వం ఒక్కటే అనీ అనరు, అనుకోలేరు. ఇక ఆత్మీకరించు కోవడమన్నది వారికి అసాధ్యమైన విషయం. అంతటి పరిణత వైఖరిని ప్రసాదించేది కేవలం అద్వైత దృష్టి మాత్రమే. ఆ అద్వైత వైఖరి వ్యావహారిక భేదాలను మిథ్యామాత్రంగా గ్రహించి, ధర్మాన్ని సమబుద్ధితో నిర్వహించమం టుంది. అనుభవాన్ని సమత్వంలో నిలుపుకోమంటుంది. ఆ సచ్చిదానంద పరబ్రహ్మాత్మక శివ జ్ఞానాన్ని వీడక పరమాత్మీయతతో తరించమంటుంది. అంతటి పరిణత వైఖరి, వర్తనను ప్రసాదించిన అద్వైత భారత వైదిక దర్శనానికి రుణపడి ఉందాం!
యముగంటి ప్రభాకర్
9440152258