పశు సంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ లక్ష్మారెడ్డి
అధికారులతో సమీక్ష
హాజీపూర్ / ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, మార్చి 31 : పాడి రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పశు సంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్ వీ లక్ష్మారెడ్డి అన్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ కలెక్టరే ట్ సమావేశ మందిరాల్లో బుధవారం జిల్లా పశు సంవర్ధక శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి సమీక్షా సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పశువుల్లో కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో భాగంగా మం చిర్యాల జిల్లాలో 81 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశారన్నారు. కేటాయించిన లక్ష్యాన్ని సం బంధిత అధికారులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్సీ కాంపోనెంట్ కింద పశుగ్రాసం కోసం రూ.20 లక్షల నిధులు విడుదల చేశామని తెలిపారు. జిల్లాలో అర్హత కలిగిన షెడ్యూల్డ్ కులాల రైతులు గడ్డి విత్తనాల కోసం పశు వైద్య కేం ద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాడి రైతుల సౌకర్యార్థం గడ్డికోత యంత్రాల కొనుగోలుకు ప్రతిపాదనలు కోరామని తెలిపారు. పశు వైద్య కేంద్రాల పరిధిలో అవసరం ఉన్న యంత్రాల కొనుగోలుకు సంబంధిత పశు వైద్యాధికారులు ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు. పశు వైద్యశాలల్లో అన్ని పశువుల్లో వచ్చే గుండె జబ్బు, గొంతు వాపు, పారుడు రోగం, గాలికుంటు తదితర వ్యాధుల నివారణ కోసం పశువులకు టీకాలు వేసేందుకు నిర్ణయించగా, 68 శాతం లక్ష్యం సాధించినట్లు తెలిపారు.
మే కలు, గొర్రెలు, పందుల్లో గాలికుంటు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో ఏర్పా టు చేసిన విజయ డెయిరీ మిల్క్ప్లాంట్లో 20 వేల లీటర్ల లక్ష్యం కాగా.. ఇప్పటికి 7 వేల లీటర్ల లక్ష్యం మాత్రమే పూర్తి అయిందన్నారు. ఇందుకుగాను పాడిరైతులకు బర్రెలు అందించి వారిని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్వంలో పశువులకు నీటి తొట్టెలు, నీడ కోసం షెడ్లు, పశుగ్రాసం అభివృద్ధికి లక్ష్యా న్ని నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ఒంగోలు, జెర్సీ, హెచ్ఎఫ్, గిర్ జాతులకు సంబంధించిన అసెస్మెంట్ అందుబాటులో ఉంచాలని పశువైద్యులు కోరారు. ఆసి ఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు శంకర్, విజయ డెయిరీ మేనేజర్ రవికుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.