కోటగిరి/రుద్రూర్, జూన్ 1: ఎన్ఆర్ఈజీఎస్లో పని చేసే కూలీల సంఖ్య మరింత పెంచాలని, ప్రతి గ్రామంలో 40 శాతం కంటే అధికంగా కూలీలు పని లో ఉండాలని లేకపోతే చర్యలు తప్పవని డీఆర్డీవో చందర్నాయక్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని నర్సరీని మంగళవారం ఆయన పరిశీలించారు. ఎన్ని మొక్కలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మొక్కల సంరక్షణ చక్కగా ఉండాలని సూచించారు. అనంతరం మండల పరిషత్ సమావేశపు మందిరం లో పంచాయతీ కార్యదర్శులతో ఉపాధి పనులపై సమీ క్ష నిర్వహించారు. వారంలో కూలీల సంఖ్య రెట్టింపు అయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో విజిలెన్స్ అధికారి నారాయణ, ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్, ఎంపీవో మారుతి, ఏపీవో రమణ, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. రుద్రూర్ చెరువు లో చేపడుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. కూలీలకు వేతనాలు త్వరగా అందేలా చూస్తామన్నారు. రుద్రూర్లో ఆయన వెంట జడ్పీటీసీ నారోజి గంగారాం, వైస్ ఎంపీపీ సాయిలు, సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీడీవో బాలగంగాధర్, ఏపీవో మనోహర్, టీఏ ప్రసాద్, కార్యదర్శి రాజేందర్ ఉన్నారు.
కూలీల సంఖ్య లక్షకు చేరుకోవాలి:ఏపీడీ డాక్టర్ సంజీవ్కుమార్
నిజామాబాద్ రూరల్, జూన్ 1: జిల్లావ్యాప్తంగా ఉపాధి కూలీల సంఖ్య లక్షకు చేరువయ్యేందుకు పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సంజీవ్కుమార్ ఆదేశించారు. రూరల్ మండలలోని పాల్దా, తిర్మన్పల్లి, శాస్త్రీనగర్ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పనులను, నర్సరీలను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువుల్లో మట్టి పూడికతీత పనులను చేపడుతున్న కూలీలతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నా రు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఫలితంగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూలీల సంఖ్య పెంచేందుకు ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. పని చేసే ప్రదేశంలో కూలీలందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపైనే ఉందన్నారు.
త్వరలో హరితహారం కింద నాటనున్న మొక్కలను నర్సరీల్లో సక్రమంగా పెంచడానికి కృషి చేయాలన్నారు. గ్రామస్థాయిలో మొక్కలు నాటడానికి ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో మల్లేశ్, ఏఈవో పద్మ, టీఏ హరీందర్, సర్పంచులు సుప్రియ నవీన్, శ్రీనివాస్రెడ్డి, ఖన్నీసాబేగం, ఎంపీటీసీలు ఆమని నరేశ్, నీరజా స్వామి, పంచాయతీ కార్యదర్శులు సంధ్య, రాకేశ్, అర్జున్, శ్రావణ్ తదితరులు ఉన్నారు. రూరల్ ఎంపీడీవోగా ఉన్న డాక్టర్ సంజీవ్కుమార్ ఇటీవల ప్రమోషన్ పొందడంతో తిర్మన్పల్లి గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఉపసర్పంచ్ నవీన్ ఆధ్వర్యంలో సన్మానించారు.