శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలు గురువారం ఘనంగా జరిగాయి. ఆలయ ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చనలు జరిపించారు. త్రిఫల వృక్షం క్రింద కొలువైన దత్తాత్రేయస్వామికి షోడశోపచార క్రతువులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. సాయంత్రం త్రయోదశి గడియల్లో నందిమండపంలోని శనగల బసవన్నకు పంచామృతాలు, ఫలోదకాలు, శుద్ధజలాలతో అభిషేకించారు. పరోక్ష సేవగా చేపడుతూ వివిధ ప్రాంతాల భక్తులు తమ గోత్రనామాలతో స్వామివారిని అర్చించుకునేలా చర్యలు తీసుకున్నట్లు ఈవో తెలిపారు.