అల్లాదుర్గం,జూలై 9: పల్లె ప్రగతి పనుల్లో అధికారులు,సర్పంచ్ల పనితీరులో మార్పు లేకుంటే వేటు తప్పదని మెదక్ కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా శుక్రవారం అల్లాదుర్గం, రెడ్డిపల్లి, వెంకట్రావుపేట గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. అల్లాదుర్గంలోని పల్లె ప్రకృతి వనం వద్ద శుభ్రంగా లేకపోవడంపై ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో కలుపు మొ క్కలను ఎందుకు తొలిగించలేదని ప్రశ్నించారు. జిల్లాలోనే అల్లాదుర్గం పల్లె ప్రగతి కార్యక్రమంలో చివరి స్థానంలో ఉందన్నారు. పల్లె ప్రగతి నిర్వాహణలో అధికారుల పనితీరు ఏమాత్రం బాగాలేదని అసహనం వ్యక్తం చేశా రు. పల్లె ప్రగతి కార్యక్రమంపై తాను సమావేశాలు నిర్వహిస్తున్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు గ్రామాల్లో పర్యటించకుండా నివేదికలు తెప్పించుకుని జిల్లా అధికారులకు పంపిస్తున్నారన్నారు. వారం రోజుల్లో వస్తానని అభివృద్ధిలో పురోగతి లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వెంకట్రావుపేటలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయకపోవడం పై అధికారుల పనితీరుకు అద్దం పడుతుందన్నారు.వెంకట్రావుపేట,రెడ్డిపల్లిల్లో పల్లెప్రకృతి వనాల నిర్వహణ పై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇరువైపులా మొక్కలను నాటాలి
నర్సాపూర్,జూలై9: రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటాలని రాష్ట్ర పంచాయతీరాజ్ చీఫ్ ఇంజినీర్ సంజీవరావు అన్నారు.మండల పరిధిలోని మూసాపేట్లో ఎమ్మె ల్యే మదన్రెడ్డి చొరవతో నూతనంగా నిర్మించిన పీఆర్ బీటీ రోడ్డు పక్కన రాష్ట్ర పం చాయతీరాజ్ చీఫ్ ఇంజినీర్ సంజీవరావు మొక్కలను నాటి నీళ్లు పోశారు.ఈ కార్యక్రమంలో పీఆర్ఈఈ రాంచంద్రారెడ్డి, పీఆర్డీఈ రాధికాలక్ష్మీ, వైస్ ఎంపీపీ నర్సింగరావు, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, ఎంపీడీవో మార్టిన్ లూథర్, సర్పంచ్ లావణ్యరవి, పీఆర్ఏఈ స్వామిదాస్ పాల్గొన్నారు.
పల్లెప్రగతి పనులు పరిశీలన
హవేళిఘనపూర్, జూలై 9: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్లు, సెక్రటరీలు డంపింగ్ యార్డు నిర్వహణ, వైకుంఠధామ నిర్మాణం, నర్సరీల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ఆమె మండల పరిధిలోని బూర్గుపల్లి, ఫరీద్పూర్లో పర్యటించారు. బూర్గుపల్లిలో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామ నిర్మాణం, డంపింగ్ యార్డు నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండల పరిధిలోని ఫరీద్పూర్లో పల్లె ప్రకృతి వనం, నర్సరీలో నిర్వహణ సరిగ్గా లేకపోవడంపై సర్పంచ్, సెక్రటరీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండు రోజుల్లో మిగిలిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, ఎంపీడీవో శ్రీరామ్, సర్పంచ్ చెన్నాగౌడ్, ఏపీవో రాజ్కుమార్ పాల్గొన్నారు.
మెగా ప్లాంటేషన్కు జిన్నారం మండలం ఎంపిక
జిన్నారం, జులై 9 : మెగా ప్లాంటేషన్కు జిన్నారం మండలాన్ని అధికారులు ఎంపిక చేశారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల అమలులో జిల్లాలోనే జిన్నారం మండలం ముందు వరుసలో ఉండటంతో అధికారులు మెగా ప్లాంటేషన్కు ఈ మండలాన్ని ఎన్నుకున్నారు. అదనపు కలెక్టర్ రాజర్షిషా, సీఈవో ఎల్లయ్య, డీఎఫ్వో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శ్రీనివాస్రావు, డీపీవో సురేశ్మోహన్, డీఎల్పీవో సతీశ్రెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో మా దారం, కొడకంచి, జిన్నారం, లక్ష్మీపతిగూడెం, వావిలాల, గడ్డపోతారం, ఖాజీపల్లి గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్గౌడ్లు సమావేశంలో పాల్గొన్నారు. ఏడు గ్రామాల ప్రధాన రోడ్లకు ఇరువైపులా రెండు వరుసల మొక్కలు నాటే మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభిస్తామని అధికారులు సమావేశంలో వెల్లడించారు. జిన్నారంలోని రైతువేదిక, నర్సరీలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమతి, ఎంపీవో రాజ్కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్లు, కార్యదర్శులు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.