ఎర్రగడ్డ, జూలై 5: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం అధికారులతో కలిసి ఎర్రగడ్డ డివిజన్లో పర్యటించారు. పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని బల్దియా డిప్యూటీ కమిషనర్ రమేశ్కు సూచించారు. డివిజన్లోని సంజయ్నగర్ నాలా కారణంగా స్థానికులు చాలా ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమస్యలన్నింటికీ సత్వర పరిష్కారాన్ని చేకూర్చేందుకు పట్టణ ప్రగతి వేదికగా నిలుస్తుందన్నారు. జూబ్లీహిల్స్, కూకట్పల్లి నియోజకవర్గాల మధ్య ఉన్న ఈ నాలా విషయమై అక్కడికి విచ్చేసిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో గోపీనాథ్ చర్చించారు.
వర్షపు నీటి కాలువ నిర్మాణంతో స్థానికుల ఇబ్బందులు దూరమవుతాయని ఇరువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. కాలువ నిర్మాణానికి అంచనా వ్యయాన్ని తయారు చేసి కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మీటర్ ఫ్యాక్టరీ మార్గంలో ఎమ్మెల్యే గోపీనాథ్ మొక్కలను నాటారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్ షాహీన్బేగం, మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు డి.సంజీవ, నేతలు గంట మల్లేశ్, జి.రాము, కల్యాణి, జులేకా, సయ్యద్స్రూల్, బాలసూర్య పాల్గొన్నారు.
వెంగళరావునగర్, జూలై 5: పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమాజిగూడ డివిజన్, నాగార్జుననగర్ కాలనీలో ఎమ్మెల్యే మాగంటి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించాలని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, తన్నుఖాన్, మధుయాదవ్, శరత్గౌడ్ పాల్గొన్నారు.